Sri Reddy : సొర‌చేప కూర వండిన శ్రీ రెడ్డి.. తింటే మంచం ఇరిగిపోవ‌ల్సిందేన‌ట‌..!

 Authored By sandeep | The Telugu News | Updated on :9 June 2022,12:30 pm

Sri Reddy : శ్రీ రెడ్డి అంటే సంచలనం, సంచలం అంటేనే శ్రీరెడ్డి. డోంట్ కేర్ అంటూ.. పెద్ద పెద్ద సినిమాల తారలకు ఎదురువెళ్ళి సంచలనంగా మారిన శ్రీరెడ్డి… ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి.. ఆతరువాత తమిళ ఇండస్ట్రీకి తరలివెళ్లింది. హ్యాపీగా చెన్నైలో ఉంటూ.. అక్కడే సెటిల్ అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ… చాలా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ప్రశాంతంగా ఉంటోంది.. అప్పుడప్పుడు కాంట్రవర్సీలను కదిలిస్తూనే ఉంది.

కానీ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. శ్రీ రెడ్డి తాజాగా యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా తన చేతి రుచిని అందరికీ పరిచయం చేస్తున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల వంటలను తయారు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరో వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి సొర చేప కూర వండింది. ఇది తింటే మంచం ఇరిగిపోవ‌ల్సిందే అంటుంది. ఇక వంట చేస్తూనే శ్రీరెడ్డి గీతోప‌దేశం చేసింది. ఇందులో సొర‌చేప తింటే మ‌న మొగుళ్లు మ‌న వెన‌క ప‌డ‌తారు అని చెప్పింది.

Sri Reddy Village Style Cooking fish curry video

Sri Reddy Village Style Cooking fish curry video

Sri Reddy : రుచి అదిరిపోవ‌ల్సిందే..

అలానే ఈ వంట‌కాలు ఆడాళ్లు చేస్తేనే బాగుంటుంద‌ని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా అందరి పై తీవ్రస్థాయిలో విరుచుకు పడే శ్రీరెడ్డి తనలో కూడా మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి చేపల కూర వండి ఆ కూరను ఎంతో మంది అనాధలకు వడ్డిస్తూ వారి ఆకలిని తీర్చారు. ఇలా శ్రీరెడ్డి అనాధలకు చేపల కూర వండి పెట్టడంతో ఎంతో మంది శ్రీరెడ్డిలో ఈ యాంగిల్ కూడా ఉందా…ఈమెలో కూడా ఈ విధమైనటువంటి మానవత్వం ఉందా అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి