Radhe Shyam : సాహో తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా, కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబడుతుంది. రాధే శ్యామ్ సినిమాలో మన హీరో ప్రభాస్ హస్తసాముద్రికంలో నిపుణుడు. అయితే అసలు చేతులే లేని వాళ్ల భవిష్యత్తుని ఎలా చెప్పడం సాధ్యమవుతుంది?.. అంటే చేతిలోని రాతలు కాదు.. మన చేతలే భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అనే అంతర్లీనమైన సందేశాన్ని ఇచ్చాడు. ఈ సీన్, ఈ డైలాగ్ ఓ దివ్యాంగురాలిని తెగ ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక. ఈమె గతంలో కూడా అనేక బొమ్మలని నోటితో పెయింట్ వేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా వేసి పాపులర్ అయింది. తాజాగా ‘రాధేశ్యామ్’ని చూసి ఆ సినిమా తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందో అంటూ ఓ పెయింట్ ని వేసి ట్వీట్ చేసింది. ఆ పెయింట్, ట్వీట్ ని డైరెక్టర్ రాధేశ్యామ్ చూసి అభినందించారు. పలు ప్రెస్ మీట్స్ లో కూడా దీనిపై మాట్లాడారు.డైరెక్టర్ రాధాకృష్ణ ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో పాటు ఆమె గీసిన పెయింట్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేసి.. ”రాధేశ్యామ్ మీకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఈ రోజు నాతో పాటు, దేశాన్ని కూడా ప్రేరేపించారు. నాలాంటి దర్శకులు ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారని నమ్ముతున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అంటూ రాధాకృష్ణ ట్వీట్ చేశారు. రాధే శ్యామ్ సినిమాలోని సీన్ను ప్రతిబింబించేలా ఆ చిత్రం ఉండటంతో షాక్ అయ్యాడు.ఇక రాధాకృష్ణ స్వప్నికని కలిసి అభినందించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దర్శకుని మంచితనాన్ని ప్రశంశిస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.