లవ్ స్టోరీ టీజర్ రిలీజ్ .. ఏంరా వదిలేస్తావా నన్ను అంటున్న సాయి పల్లవి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

లవ్ స్టోరీ టీజర్ రిలీజ్ .. ” ఏంరా వదిలేస్తావా నన్ను అంటున్న సాయి పల్లవి ” ..!

లవ్ స్టోరీ .. అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సినిమా. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం లవ్ స్టోరీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు భారీగా పెరిగేలా చేశాయి. పక్కా శేఖర్ కమ్ముల మార్క్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా […]

 Authored By govind | The Telugu News | Updated on :10 January 2021,12:42 pm

లవ్ స్టోరీ .. అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సినిమా. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం లవ్ స్టోరీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు భారీగా పెరిగేలా చేశాయి. పక్కా శేఖర్ కమ్ముల మార్క్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా మీద అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. మజిలీ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న ఈ సినిమా తో మరో హిట్ దక్కబోతుందన్న నమ్మకంగా ఉన్నాడు.

Naga Chaitanya and Sai Pallavi's 'Love story' teaser out! | TeluguBulletin.com

కాగా ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. నాగ చైతన్య – సాయి పల్లవి సినిమాలోని పాత్రలకు ప్రాణం పోశారని తాజా టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ ఆయన గత చిత్రాలకంటే భారీ హిట్ అందుకోవడం పక్కా అని ఈ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ టీజర్ చివరిలో నాగ చైతన్య ని చూస్తు ఏంరా నన్ను వదిలేస్తావా అన్న డైలాగ్ యూత్ కి సూపర్ కిక్ ఇస్తోంది.

LoveStory Teaser | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch - YouTube

కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. కాగా నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సాయి పల్లవి విరాట పర్వం, నాని తో శ్యాం సింగ్ రాయ్ సినిమాలు చేస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది