Home » Entertainment » The Reason Why There Was News About Jagapathi Babu And Soundarya
Entertainment

Jagapathi Babu – Soundarya : జగపతి బాబు – సౌందర్య అఫైర్ అంటూ అప్పట్లో న్యూస్ రావడానికి కారణం ఇదే.!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 29, 2022 1:09 pm
Advertisement

Jagapathi Babu – Soundarya : సౌంద‌ర్య అటు అందాన్నిఇటు అభిన‌యాన్ని వేల‌సి అందాన్ని ,అభిన‌యాన్ని అందించ‌గ‌ల ఈ త‌రంలో న‌టించ‌గ‌ల ఏకైక న‌టి గా పేరు తెచ్చుకున్నారు సౌంద‌ర్య . మ‌హ‌న‌టి సావిత్రీతో ఆమెను పోల్చేవారు. అయితే సావిత్రీ గారి స్థాయి పాత్ర‌ల‌ను త‌ను ఇంకా చెయ‌లేద‌ని సౌంద‌ర్య చెప్పేవారు.తాను తెలుగింటి అమ్మాయి కాక‌పోయిన తెలుగువారి మ‌న‌స్సుల్లో ఒక ప్ర‌త్యేక‌మైన స్థానంను ఆమె సంపాధించుకున్నారు. 100 చిత్రాల‌లో క‌థానాయ‌కిగా న‌టించారు సౌంద‌ర్య‌.అగ్ర హిరోలంద‌రి స‌ర‌స‌న ఆమె న‌టించారు.ఇంత‌లో ఆమె పెళ్ళి చెసుకోవ‌డంతో న‌టిగా సౌంద‌ర్య అధ్య‌నం ఇక ముగిసింద‌ని అంద‌రు అనుకున్నారు. అయితే కొన్ని పాత్ర‌ల‌కు ఆమె మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌దు అని ఆమెను వెతుకుంటూ కోన్ని పాత్ర‌లు వేళ్ళాయి. పెళ్ళైన త‌రువాత త‌ను తిసిన 100 వ చిత్రం స్వేత నాగులో ఆమె న‌టించ‌డం గ‌మ‌నార్ద‌కం. ఆమె హిరోలు,

Advertisement

ఆమె సాధించిన విజ‌యాల‌ను ఒక సారి గుర్తు చెసుకుందాం. సౌంద‌ర్య న‌టించిన తోలి చిత్రాలు రైతు భార‌తం. మ‌న‌వ‌రాళి పెళ్ళి వంటి చాత్రాల‌లో భాను చంద‌ర్ ,హ‌రిష్ స‌ర‌స‌న న‌టించారు సౌంద‌ర్య. ఆ త‌రువాత అమ్మోరు చిత్రంలో సురేష్ స‌ర‌స‌న న‌టించ‌న తెలుగులో తోలి హిట్ట్ సినిమా మాత్రం రాజేంద్రుడు గ‌జేంద్రుడు అని మాత్ర‌మే చేప్పాలి .అమ్మోరు సినిమా పెద్ద హిట్టైన . ఆ చిత్రం నిర్మాణానికి నాలుగేళ్ళు ప‌ట్టడంతో ప్రారంభంలో ఆమెకు రావ‌ల‌సిన పేరు ఈ చిత్రంలో కాకుండా మిగిలిన చిత్రాల ద్వార వ‌చ్చింది. రాజేంద్రుడు గ‌జేంద్రుడు మూవి త‌రువాత రాజేంద్ర‌ప్ర‌సాద్ తోనే మాయ‌లోడు చిత్రంలో న‌టించారు సౌంద‌ర్య . ఆ రెండు సినిమాలు హిట్టే .ఆ త‌రువాత మెడ‌మ్ సినిమాలో మ‌ళ్ళి రాజేంద్ర‌ప్ర‌సాద్ తోనే న‌టించారు సౌంద‌ర్య .సూప‌ర్ స్టార్ కృష్ణ స‌ర‌స‌న సౌంద‌ర్య‌ న‌టించిన తోలి చిత్రం నెంబ‌ర్ వ‌న్. ఈ సినిమా హిట్ట్ అవ్వ‌డంతో సౌంద‌ర్య జాత‌కం మారిపోయింద‌నే చేప్పాలి.కృష్ట వంటి అగ్ర హిరోతో న‌టించ‌డంతో ఆమె స్థాయి పెరిగిపోయి.

the reason why there was news about Jagapathi Babu And Soundarya

Advertisement

ఇత‌ర అగ్ర హిరోల‌తో స‌ర‌స‌న‌ న‌టించే అవ‌కాశాలు ఆమెను వెతుకుంటు వ‌చ్చాయి .ఆ త‌రువాత మేగ‌స్టార్ చీరంజివి స‌ర‌స‌న తోలిసారిగా న‌టించిన‌ సినిమా రిక్షావాడు .ఆ త‌రువాత చూడాల‌ని ఉంది ,అన్న‌య్య వంటి సినిమాల‌లో న‌టించారు. వృత్తి ప‌ట్ల అంకిత భావం క‌లిగి ఉన్నసౌంద‌ర్య అంటే మేగ‌స్టార్ కి ఏంతో గౌర‌వం .ఆమె మ‌ర‌ణంతో మంచి శ్రేయోభిలాషిని కోల్పోయాన‌ని ఆయ‌న బాద‌ప‌డ్డారు.నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ గారి స‌ర‌స‌న న‌టించిన ఏకైక తోలి చిత్రం టాప్ హిరో .ఆ త‌రువాత బాల‌కృష్ణ ద‌ర‌శ‌క‌త్వం వ‌హించిన‌ చిత్రం న‌ర్త‌నశాల‌లో ద్రౌప‌తిగా న‌టించ‌మ‌ని ఆయ‌న సౌంద‌ర్య‌ను అడిగితే ఆమె స‌సే అన్నారు . సౌంద‌ర్య ఆ చిత్రంలో షూటింగ్ నాలుగు రోజులు ప‌డుతున్న త‌న వ‌ర్క్ ను ఒక‌టింన్న‌ర రోజుల‌లోనే ఆమె పూర్తి చేశారు.న‌ర్త‌న వాల రెండోవ ష‌డ్యూలు ప్రారంభం కాక ముందే విమాణ ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ సౌంద‌ర్య‌గారు క‌న్నుమూయ‌డం దృద‌రుష్ట‌క‌రం. ఇక కీంగ్ నాగార్జునతో హ‌లోబ్ర‌ద‌ర్ చిత్రంలో తోలిసారి న‌టించారు. ఆ త‌రెవాత సౌంద‌ర్య ఎదురులేని మ‌నిషి ,రాముడొచ్చాడు , నిన్నేప్రేమిస్తా సినిమాలో సౌంద‌ర్య, నాగార్జున జంట ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

విక్ట‌రి వేంక‌టేష్ స‌ర‌స‌న సౌంద‌ర్య తోలిసారిగా న‌టించిన సినిమా సూప‌ర్ పోలిస్ . కాని ఈ సినిమా ప్లాప్ అయింది .అయితే ఆ త‌రువాత న‌టించిన చిత్రం ప‌విత్ర‌బంధం ,పెళ్ళి చేసుకుందాం,ఇంట్లో ఇల్లాలు వంటేంట్లో ప్రియురాలు ,రాజా ,జ‌యం మ‌న‌దేరా వంటి చిత్రాల‌న్ని హిట్ట్ అయినాయి.అలాగే డాక్ట‌ర్ మోహ‌న్ బాబు అంటే సౌంద‌ర్యకి ఏంతో గౌర‌వం. పెద్ద‌రాయుడు చిత్రంలో త‌న‌కు మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ఆమె ప‌దే ప‌దే కృత‌గ్ఙ్న‌త‌లు చేప్పేవారు . ఆయ‌న స‌ర‌స‌న రాయుడు , పోస్ట్ మాన్ ,అధిప‌తి ,శ్రీ రాముల‌య్య వంటి చిత్రాల‌లో న‌టించారు.సౌంద‌ర్య న‌టించి చివ‌రి చిత్రం శివ శంక‌ర్ మోహ‌న్ బాబుదే కావ‌డం గ‌మ‌నార్ద‌కం .ఏంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విద్యా స‌మ‌స్థ‌ల‌ను నిర్వ‌హిస్తున్న మోమ‌న్ బాబుని సౌంద‌ర్య గౌర‌వించేవారు.సౌంద‌ర్య‌తో ఏంతో స‌న్నిహితంగా మెలిగిన హిరో జ‌గ‌ప‌తి బాబు .వారి సానిహిత్యం చూసి వీరు పెళ్ళికూడా చేసుకుంటారు అని అంద‌రు అనుకున్నేవారు.మేమిద్ద‌రం మంచి స్నేహితుల‌ము అని ఎన్ని సార్లు చేప్పిన వ‌దంతులు ఆగ‌లేదు .చివ‌ర‌కు సౌంద‌ర్య పెళ్ళి వాట‌న్నింటికి స‌మాధ‌నం చేప్పింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి