Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలుగుతున్న త్రివిక్రమ్ ఈమధ్య కాలంలో స్పీడ్ తగ్గించారు అని చెప్పాలి. ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో “అల వైకుంఠపురములో” సినిమా చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో “భీమ్లానాయక్” కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే పని చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్న కుదరలేదు. మధ్యలో కారణాలు చెప్పకుండా సినిమాను చర్చల దశలోనే ఆపేసినట్టు సమాచారం.
చివరికి మహేష్ తో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా షూటింగ్ వడివడిగా సాగడం లేదు. మహేష్ తల్లి ఇందిరాదేవి అకాల మృతితో కొద్ది రోజులు సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయగా, యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్కి కొన్నాళ్ల పాటు బ్రేక్ పడనుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నప్పుడే హీరోల తండ్రులు చనిపోతున్నారనే సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకటరావు అనారోగ్యం కారణంతో కన్నుమూశారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్న సమయంలో ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారని నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్తో సినిమా చేస్తుండగా, కృష్ణ చనిపోయారు. అలా పవన్ -కళ్యాణ్ తండ్రి వెంకట్రావు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ , మహేష్ తండ్రి కృష్ణ … త్రివిక్రమ్ సెంటిమెంట్తో చని పోయారని సదరు నెటిజన్ పేర్కొన్నాడు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.