Veera Simha Reddy Movie : వీరసింహా రెడ్డి లో నటించినందుకు వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? బాలయ్య కంటే ఎక్కువా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Veera Simha Reddy Movie : వీరసింహా రెడ్డి లో నటించినందుకు వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? బాలయ్య కంటే ఎక్కువా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,9:00 pm

Veera Simha Reddy Movie : నటసింహం బాలయ్య రీసెంట్ మూవీ ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటుంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ అవడంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తు తన ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే తన రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పారు. గోపిచంద్ మలినేని ఇప్పటివరకు తీసిన సినిమాలకు పూర్తి రెమ్యూనరేషన్ ఎప్పుడూ రాలేదని స్వయంగా తానే చెప్పారు.

ఒక్క వీరసింహారెడ్డి సినిమాకు మాత్రమే పూర్తి రెమ్యూనరేషన్ తీసుకున్నానని ఆయన అన్నారు. గోపీచంద్ మలినేని రవితేజతో డాన్ శీను సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్ సినిమాలు చేశారు. విన్నర్ తప్ప మిగతా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాలలో ఒక్క సినిమాకు కూడా పూర్తి రెమ్యూనరేషన్ రాలేదని చెప్పారు. రవితేజ తో కలిసి తీసిన క్రాక్ సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత తనకు రెమ్యూనరేషన్ అందిందని చెప్పారు. ఆ విషయంలో చాలానే గొడవలు జరిగినట్లు చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం

Varalaxmi Sarathkumar remuneration for Veera Simha Reddy Movie

Varalaxmi Sarathkumar remuneration for Veera Simha Reddy Movie

వహించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య రోల్ మామూలుగా లేదంటున్నారు అభిమానులు. థియేటర్స్ లో జై బాలయ్య అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఇక బాలయ్య యాక్షన్ తోపాటు ఎమోషన్ ని కూడా పండించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. హనీ రోజ్ సెకండ్ హీరోయిన్గా నటించింది. కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ నటించారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వరలక్ష్మి శరత్ కుమార్ పుచ్చుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి