Venu Swamy : పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటాడంటూ బాంబు పేల్చిన వేణు స్వామి .. !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటాడంటూ బాంబు పేల్చిన వేణు స్వామి .. !!

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. అయితే ఆయన చెప్పిన జాతకాలలో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. గతంలో సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు వారు త్వరలోనే విడిపోబోతున్నారు అని వేణు స్వామి కామెంట్ చేశారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆయన అన్నట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి చెప్పినవి జరుగుతున్నాయని కొందరు […]

 Authored By anusha | The Telugu News | Updated on :2 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటాడంటూ బాంబు పేల్చిన వేణు స్వామి .. !!

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. అయితే ఆయన చెప్పిన జాతకాలలో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. గతంలో సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు వారు త్వరలోనే విడిపోబోతున్నారు అని వేణు స్వామి కామెంట్ చేశారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆయన అన్నట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి చెప్పినవి జరుగుతున్నాయని కొందరు ఆయనను ఫాలో అయ్యేవారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జాతకాలు బెడిసి కొట్టాయి. ప్రభాస్ కెరియర్ అయిపోయిందని అన్నారు. కానీ సలార్ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ గెలుస్తారని చెప్పారు…

అది కూడా బెడిసి కొట్టడంతో సోషల్ మీడియాలో వేణు స్వామిని జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి అన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ మరోసారి కాంట్రవర్సీపాలు అవుతారని చెప్పుకొచ్చారు. అతడికి సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా కాంట్రవర్సీలు జరగబోతున్నాయని, వాటన్నింటినీ ఆయన ఎదుర్కోక తప్పదు అంటూ వివరించారు. వాస్తవానికి ఆయనకు చెప్పే మగాడు లేకే రాజకీయాలు చేస్తూ అనవసరంగా పేరు నాశనం చేసుకుంటున్నారు అని అన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలనుకునే వాళ్ళలో తాను కూడా ఉన్నానని, ఆ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అర్థం కాక అనవసరంగా తనపై ట్రోల్ చేస్తుంటారని ఫైర్ అయ్యారు.

అయితే 2024 జులై తర్వాత పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకులు తీసుకునే అవకాశం ఉందని వేణు స్వామి వెల్లడించారు. ఎన్నికలు అయిపోగానే మూడో భార్య అన్నా లెజ్నివాకు ఆయన దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప పవన్ కళ్యాణ్ కు చెప్పే వాడే లేడని, కానీ ఆయన పర్సనల్ విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరని వేణు స్వామి వివరించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించి ఏం చేస్తే తాను సీఎం అవుతానో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన సినిమాలన్నీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని వెల్లడించారు. ఇక ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేణు స్వామి చెప్పినట్టుగా నిజంగానే పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటాడా అనేది చూడాలి. అది కనుక తప్పయితే వేణు స్వామికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో మూడిందే.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది