what is the reason for gap between Sr ntr and mohanbabu
SR NTR vs Mohanbabu : అప్పట్లో.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలింది ముగ్గురు నలుగురు హీరోలు మాత్రమే. అందులో ముందు వరుసలో ఉంటారు సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు లాంటి వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో అందరు పెద్ద హీరోలు ఇతర హీరోలతో కలిసి మెలిసే ఉండేవారు. అయితే.. మోహన్ బాబు మాత్రం ఎప్పుడూ సభల్లో ఒక విషయం చెబుతుంటారు. ఈ ఇండస్ట్రీలో నాకు గురువు గారు అంటే దాసరి నారాయణ రావు అని.. అన్న గారు అంటే ఎన్టీఆర్ అని అంటారు.కాకపోతే.. అప్పట్లో ఎన్టీఆర్, మోహన్ బాబు మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. ఈ విషయాన్ని చాలా సార్లు మోహన్ బాబు వేదికల మీద చెప్పినప్పటికీ.. అసలు వాళ్లిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో మాత్రం దానికి కారణం ఇప్పటి వరకు చెప్పలేదు.
అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి సీఎం పదవి నుంచి దిగి పోయి ప్రతిపక్షంలో ఉన్నసమయంలోనే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాను తీశారు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది.ఈ సినిమాను లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. మోహన్ బాబే ఈ సినిమాకు నిర్మాత. రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ తర్వాత ఎన్టీఆర్ మరోసారి జరిగిన ఎన్నికల్లో సీఎం అయ్యారంటే దానికి ఒకరకంగా ఈ సినిమానే కారణం. అలాగే.. మోహన్ బాబుకు కూడా ఆ సినిమానే పెద్ద బ్రేక్ ఇచ్చింది.
what is the reason for gap between Sr ntr and mohanbabu
ఎందుకంటే.. అప్పటి వరకు మోహన్ బాబు సినిమాలన్నీ ప్లాఫ్ అవుతూ వచ్చాయి. ఆర్థికంగానూ మోహన్ బాబు చాలా నష్టపోయాడు. అదే సమయంలో ఎన్టీఆర్ తో తీసిన మేజర్ చంద్రకాంత్ సూపర్ డూపర్ హిట్ అయింది. మోహన్ బాబుకు చాలా లాభాలు తెచ్చిపెట్టింది.ఆ సినిమా విడుదలయ్యాక.. కొన్ని రోజులకు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. దీంతో తనకు ఖర్చులు పెరిగగాయని.. దీంతో ఇప్పుడు తాను మేజర్ చంద్రకాంత్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటానని మోహన్ బాబుకు ఎన్టీఆర్ చెప్పారట.
దీంతో సరే.. అని మోహన్ బాబు ఖాళీ చెక్కును తీసుకెళ్లి ఎన్టీఆర్ కు ఇచ్చారట మోహన్ బాబు. అయితే.. 25 లక్షలు ముందు ఇస్తానంటే సినిమా హిట్ అయ్యాకే ఇవ్వు.. ఇప్పుడు వద్దు అని అన్న సీనియర్ ఎన్టీఆర్.. ఖాళీ చెక్కు మీద 50 లక్షలు రాసుకున్నారట.ఆ విషయంలోనే ఇద్దరి మధ్య చెడిందట. తనకు లాభాలు తెచ్చిపెట్టినా.. ఎన్టీఆర్ 25 లక్షలు రాసుకుంటారేమోనని మోహన్ బాబు అనుకున్నారట. కానీ.. ఎన్టీఆర్ 50 లక్షల వరకు చెక్ మీద రాసుకొని తీసుకునేసరికి.. మోహన్ బాబు హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకే.. అప్పటి నుంచి మోహన్ బాబు, సీనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పుడూ ఎన్టీఆర్ తో మోహన్ బాబు మాట్లాడలేదట.ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు కూడా మోహన్ బాబు ఎన్టీఆర్ ను కలవలేదట. చివరకు ఎన్టీఆర్ చనిపోయాక మాత్రం ఆయన్ను చూడటానికి మోహన్ బాబు వెళ్లారట.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.