SR NTR vs Mohanbabu : సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు మధ్య గ్యాప్ కు కారణం అదేనట.. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట?

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 March 2022,7:40 am

SR NTR vs Mohanbabu : అప్పట్లో.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలింది ముగ్గురు నలుగురు హీరోలు మాత్రమే. అందులో ముందు వరుసలో ఉంటారు సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు లాంటి వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో అందరు పెద్ద హీరోలు ఇతర హీరోలతో కలిసి మెలిసే ఉండేవారు. అయితే.. మోహన్ బాబు మాత్రం ఎప్పుడూ సభల్లో ఒక విషయం చెబుతుంటారు. ఈ ఇండస్ట్రీలో నాకు గురువు గారు అంటే దాసరి నారాయణ రావు అని.. అన్న గారు అంటే ఎన్టీఆర్ అని అంటారు.కాకపోతే.. అప్పట్లో ఎన్టీఆర్, మోహన్ బాబు మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. ఈ విషయాన్ని చాలా సార్లు మోహన్ బాబు వేదికల మీద చెప్పినప్పటికీ.. అసలు వాళ్లిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో మాత్రం దానికి కారణం ఇప్పటి వరకు చెప్పలేదు.

అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి సీఎం పదవి నుంచి దిగి పోయి ప్రతిపక్షంలో ఉన్నసమయంలోనే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాను తీశారు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది.ఈ సినిమాను లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. మోహన్ బాబే ఈ సినిమాకు నిర్మాత. రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ తర్వాత ఎన్టీఆర్ మరోసారి జరిగిన ఎన్నికల్లో సీఎం అయ్యారంటే దానికి ఒకరకంగా ఈ సినిమానే కారణం. అలాగే.. మోహన్ బాబుకు కూడా ఆ సినిమానే పెద్ద బ్రేక్ ఇచ్చింది.

what is the reason for gap between Sr ntr and mohanbabu

what is the reason for gap between Sr ntr and mohanbabu

ఎందుకంటే.. అప్పటి వరకు మోహన్ బాబు సినిమాలన్నీ ప్లాఫ్ అవుతూ వచ్చాయి. ఆర్థికంగానూ మోహన్ బాబు చాలా నష్టపోయాడు. అదే సమయంలో ఎన్టీఆర్ తో తీసిన మేజర్ చంద్రకాంత్ సూపర్ డూపర్ హిట్ అయింది. మోహన్ బాబుకు చాలా లాభాలు తెచ్చిపెట్టింది.ఆ సినిమా విడుదలయ్యాక.. కొన్ని రోజులకు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. దీంతో తనకు ఖర్చులు పెరిగగాయని.. దీంతో ఇప్పుడు తాను మేజర్ చంద్రకాంత్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటానని మోహన్ బాబుకు ఎన్టీఆర్ చెప్పారట.

SR NTR vs Mohanbabu : ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వచ్చిన సినిమా మేజర్ చంద్రకాంత్

దీంతో సరే.. అని మోహన్ బాబు ఖాళీ చెక్కును తీసుకెళ్లి ఎన్టీఆర్ కు ఇచ్చారట మోహన్ బాబు. అయితే.. 25 లక్షలు ముందు ఇస్తానంటే సినిమా హిట్ అయ్యాకే ఇవ్వు.. ఇప్పుడు వద్దు అని అన్న సీనియర్ ఎన్టీఆర్.. ఖాళీ చెక్కు మీద 50 లక్షలు రాసుకున్నారట.ఆ విషయంలోనే ఇద్దరి మధ్య చెడిందట. తనకు లాభాలు తెచ్చిపెట్టినా.. ఎన్టీఆర్ 25 లక్షలు రాసుకుంటారేమోనని మోహన్ బాబు అనుకున్నారట. కానీ.. ఎన్టీఆర్ 50 లక్షల వరకు చెక్ మీద రాసుకొని తీసుకునేసరికి.. మోహన్ బాబు హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకే.. అప్పటి నుంచి మోహన్ బాబు, సీనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పుడూ ఎన్టీఆర్ తో మోహన్ బాబు మాట్లాడలేదట.ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు కూడా మోహన్ బాబు ఎన్టీఆర్ ను కలవలేదట. చివరకు ఎన్టీఆర్ చనిపోయాక మాత్రం ఆయన్ను చూడటానికి మోహన్ బాబు వెళ్లారట.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి