Chiranjeevi : మెగా ఫ్యాన్స్ ఆనందించే విషయాన్ని చిరంజీవి ఫ్యామిలీ ఎందుకు దాచి ఉంచుతోంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : మెగా ఫ్యాన్స్ ఆనందించే విషయాన్ని చిరంజీవి ఫ్యామిలీ ఎందుకు దాచి ఉంచుతోంది?

Chiranjeevi : మెగాస్టార్‌కు అభిమానులు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక వ్యక్తి కాదు ప్రభంజనం అని అంటారు. అన్నయ్య బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అంతటి రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. చిరు,పవన్ తర్వాత ఆ స్థానాన్ని రాంచరణ్, వరుణ్ తేజ్ భర్తీ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇక పవన్ కొడుకు అఖిరా నందన్ సినిమాల్లోకి రాలేదు. వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే. Chiranjeevi […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 September 2022,2:30 pm

Chiranjeevi : మెగాస్టార్‌కు అభిమానులు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక వ్యక్తి కాదు ప్రభంజనం అని అంటారు. అన్నయ్య బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అంతటి రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. చిరు,పవన్ తర్వాత ఆ స్థానాన్ని రాంచరణ్, వరుణ్ తేజ్ భర్తీ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇక పవన్ కొడుకు అఖిరా నందన్ సినిమాల్లోకి రాలేదు. వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.

Chiranjeevi : మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడా..

మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కుమార్తైలు ఉన్నారు. వీరికి వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. ఇక రాంచరణ్‌ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి కూడా కొన్ని సంవత్సరాలు గడిచాయి.కానీ వీరికి ఇంకా సంతానం కలుగలేదు. అయితే, చరణ్- ఉపాసన సంతానం విషయంలో తొందర పడొద్దని నిర్ణయించుకున్నారట.. ఏదేమైనా వారసుడిని ఎత్తుకోవాలని, తమ రక్తం పంచుకున్న పసివాడితో ఆడుకోవాలని చిరంజీవి దంపతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారట.. కానీ ఉపాసన మాత్రం పిల్లల విషయంలో చెర్రీని కట్టడి చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉండగా ఉపాసన ప్రస్తుతం గర్భం దాల్చిందని ప్రచారం సాగుతోంది.

why chiranjeevi family hiding Ram Charan Upasana Pregnancy Matter

why chiranjeevi family hiding Ram Charan Upasana Pregnancy Matter

ఈ విషయాన్ని కావాలనే ఎందుకు దాస్తున్నారని, మెగా అభిమానులకు ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు కదా అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఉపాసన-చరణ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నారని తెలిస్తే అందరూ సంతోషిస్తారు కదా.. చాలా కాలంగా చిరంజీవి ఈ క్షణం కోసమే ఎంతో తాపత్రయపడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఐదు నెలలు కంప్లీట్ చేసుకున్నా మెగా కంపౌండ్ నుంచి ఈ వార్త ఎందుకు బయటకు రానివ్వడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత సంతోషకరమైన వార్తను మెగా ఫ్యామిలీ దాచి ఉంచడం ఎంతవరకు కరెక్ట్..ఈ విషయంలో చిరంజీవి పెద్దరికం ఎక్కడ పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది