Nagarjuna : సామాన్యులు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే మాత్రం రోజుల తరబడి వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు.. రాజకీయ ప్రముఖులు లేదా వ్యాపారవేత్తలు ఎవరు చనిపోయినా వాళ్లకు చాలామంది నివాళులు అర్పిస్తారు. ఇక.. మన తెలుగు ఇండస్ట్రీనే తీసుకుంటే గత సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు కన్నుమూశారు. దిగ్గజ నటులే ఈ లోకాన్ని వీడిపోయారు. కృష్ణంరాజు, కృష్ణ, చలపతి రావు, సత్యనారాయణ.. ఇలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్లే వెళ్లిపోయారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా మూగబోయింది.
ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి ఆ ఇంటి సభ్యులను ఓదార్చుతారు. ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తారు. వాళ్లకు ఏదైనా సాయం కావాలంటే అందరూ తలా చేయి వేసి మేమున్నాం అంటూ అండగా నిలబడతారు. అయితే.. ఎంతమంది దిగ్గజ నటులు చనిపోయినా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం వాళ్ల చివరి చూపు చూడటానికి వెళ్లరట. ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ వెళ్తారు కానీ.. నాగార్జున మాత్రం అస్సలు వాళ్లను కడసారి కూడా చూడటానికి వెళ్లరు అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. తన నాన్న నాగేశ్వరరావు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. నాగార్జునను ఓదార్చింది. ఏఎన్నార్ కు ఘనమైన వీడ్కోలు అందించారు.
నాగార్జునకు కూడా ధైర్యం చెప్పారు. కానీ.. తన నాన్న వయసు ఉన్న ఇండస్ట్రీ పెద్దలు మరణిస్తే మాత్రం నాగార్జున ఒక్కరిని కూడా చూడటానికి వెళ్లలేదు. ఆయన వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించకపోవడానికి కారణాలు ఏంటి అని అందరూ ఏదేదో ఊహించుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక చనిపోయిన వాళ్లను చూస్తే అదో అపశకునంలా భావిస్తారా? అనేది తెలియక అక్కినేని ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు.. నాగార్జున ఎందుకు చనిపోయిన వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించరో అనే విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.