why nagarjuna is not attending for celebrities final rites
Nagarjuna : సామాన్యులు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే మాత్రం రోజుల తరబడి వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు.. రాజకీయ ప్రముఖులు లేదా వ్యాపారవేత్తలు ఎవరు చనిపోయినా వాళ్లకు చాలామంది నివాళులు అర్పిస్తారు. ఇక.. మన తెలుగు ఇండస్ట్రీనే తీసుకుంటే గత సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు కన్నుమూశారు. దిగ్గజ నటులే ఈ లోకాన్ని వీడిపోయారు. కృష్ణంరాజు, కృష్ణ, చలపతి రావు, సత్యనారాయణ.. ఇలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్లే వెళ్లిపోయారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా మూగబోయింది.
ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి ఆ ఇంటి సభ్యులను ఓదార్చుతారు. ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తారు. వాళ్లకు ఏదైనా సాయం కావాలంటే అందరూ తలా చేయి వేసి మేమున్నాం అంటూ అండగా నిలబడతారు. అయితే.. ఎంతమంది దిగ్గజ నటులు చనిపోయినా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం వాళ్ల చివరి చూపు చూడటానికి వెళ్లరట. ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ వెళ్తారు కానీ.. నాగార్జున మాత్రం అస్సలు వాళ్లను కడసారి కూడా చూడటానికి వెళ్లరు అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. తన నాన్న నాగేశ్వరరావు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. నాగార్జునను ఓదార్చింది. ఏఎన్నార్ కు ఘనమైన వీడ్కోలు అందించారు.
why nagarjuna is not attending for celebrities final rites
నాగార్జునకు కూడా ధైర్యం చెప్పారు. కానీ.. తన నాన్న వయసు ఉన్న ఇండస్ట్రీ పెద్దలు మరణిస్తే మాత్రం నాగార్జున ఒక్కరిని కూడా చూడటానికి వెళ్లలేదు. ఆయన వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించకపోవడానికి కారణాలు ఏంటి అని అందరూ ఏదేదో ఊహించుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక చనిపోయిన వాళ్లను చూస్తే అదో అపశకునంలా భావిస్తారా? అనేది తెలియక అక్కినేని ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు.. నాగార్జున ఎందుకు చనిపోయిన వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించరో అనే విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.