
Sreemukhi : ఈటీవీ మల్లెమాల వారు 10 సంవత్సరాల క్రితం జబర్దస్త్ కామెడీ షో ప్రారంభించిన సమయంలో యాంకర్ గా శ్రీముఖి ని మొదట సంప్రదించడం జరిగిందట. కొన్ని కారణాలవల్ల ఆ సమయంలో శ్రీముఖి నో చెప్పింది. దాంతో అనసూయకి ఆ ఛాన్స్ దక్కింది. కొత్త పేస్ అయినా కూడా ప్రేక్షకులు ఆమెను ఆదరించారు, ఆమె కూడా ప్రేక్షకులను సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించింది. దాంతో మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆమె జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆమె జబర్దస్త్ నుండి వెళ్లి పోయింది. మల్లెమాల కి గుడ్ బై చెప్పేసి, ఈటీవీ లో కార్యక్రమాలన్నింటిని వదిలేసి స్టార్ మా కి జంప్ ఆయన విషయం తెలిసిందే.
మల్లెమాల మరియు ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమాలను అనసూయ వదిలేసి వెళ్లిన సమయంలో ఆమె స్థానంలో భర్తీ చేసేందుకు మళ్లీ ఒకసారి శ్రీముఖిని సంప్రదించడం జరిగిందట. గతంలో శ్రీముఖి జబర్దస్త్ అవకాశాన్ని వదులుకున్నందుకు బాధపడ్డానంటూ వ్యాఖ్యలు చేసింది. కనుక ఈసారి ఆమెకు అవకాశం వస్తే తప్పకుండా వదిలేయదు అని అంతా భావించారు, కానీ ఆమె తాను జబర్దస్త్ కార్యక్రమంలో చేయలేనంటూ చెప్పిందంట. అందుకు కారణం కూడా ఆమె ఇంట్రెస్టింగ్ గా చెప్పిందని మల్లెమాల వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇంతకు ఆమె చెప్పిన కారణమేంటంటే.. జబర్దస్త్ కార్యక్రమానికి తాను యాంకర్ గా వ్యవహరిస్తే మల్లెమాల వారికి బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తాను ఒక ఈటీవీకి పరిమితం అవ్వాలని కోరుకోవడం లేదు అన్ని, ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో పాటు యూట్యూబ్లో కూడా తాను సందడి చేయాలని అనుకుంటున్నాను అందుకే తాను బాండ్ కి కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదు అందట.
why Sreemukhi again says no to jabardasth comedy show anchor
ఇతర ఛానల్ లో అవకాశం వచ్చినప్పుడు చేస్తాను, లేదంటే ఖాళీగా ఉంటాను. అంతే తప్పితే జబర్దస్త్ కోసం మల్లెమాల వారికి కట్టు బానిసగా మారే ఉద్దేశం లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసిందట. బాండ్ ఇస్తే కట్టు బానిస అన్నట్లుగానే ఆ మధ్య జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన కొందరు కమెడియన్సు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరీ అంతా కఠినమైన పదం వాడడం సరికాదు. కానీ ఒక సంస్థ తమ వద్ధ చేసే వారితో బాండ్ చేసుకోవడం అనేది సరైనదే కనుక మల్లెమాల వారు బాండ్ కి ఒప్పించడం కరెక్టే.. అలాగే నాలుగు చానల్స్ తిరగాలనుకునే వారు ఆ బాండ్ కాదని కార్యక్రమాన్ని వద్దనుకోవడం కరెక్టే.. కనుక శ్రీముఖి కార్యక్రమాన్ని వద్దు అనుకోవడంలో తప్పేం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
This website uses cookies.