jagan and narendra modi green signal to early elections
YS Jagan : ఇది పాలన అంటే. ఏమాత్రం అనుభవం లేకున్నా కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అదంతా పక్కన పెడితే.. నిజాయితీగా పని చేసుకుంటూ పోతే శత్రువు అయినా శెభాష్ అంటాడు అని మరోసారి రుజువు అయింది. సీఎం జగన్ కు ఇప్పుడు కేంద్రం కూడా మద్దతు అందిస్తోంది. మోదీ సర్కార్ తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని దన్నుగా నిలిచింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏకంగా రూ.12 వేల కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇది నిజంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నిజానికి.. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు వెంటనే పోలవరం పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అసలు పోలవరం ప్రాజెక్ట్ నే మరిచిపోయారు.
కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే.. కేంద్రంతో పోరాడి మరీ పోలవరానికి నిధులు తీసుకొచ్చారు. ఇలాంటి పని చంద్రబాబు చేయలేకపోయారు. కానీ.. ఢిల్లీలో నెలలకు నెలలు మకాం వేసి.. ఎన్నోసార్లు కాళ్లు అరిగేలా తిరిగి పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతను కేంద్రానికి సీఎం జగన్ స్పష్టం చేయగలిగారు. అందుకే ఇప్పుడు నిధులు వరదలా పారుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టు కమిషన్ కు కక్కుర్తి పడి చంద్రబాబు అడ్డదిడ్డంగా నిర్మాణం చేపట్టారు. నాణ్యత లేకుండా చేపట్టారు. చివరకు నిధులు కూడా తీసుకురాలేకపోయారు. చంద్రబాబు చేసిన తప్పిదానికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
central govt good news to polavaram project
కానీ.. సీఎం జగన్ మాత్రం కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చారు. ఏపీ విభజన తర్వాత ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేలా సీఎం జగన్ సాధించి చూపించారు. అవి రూ.10 వేల కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా కేంద్రం తాజాగా నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగానే ఆ నిధులను కేంద్రం విడుదల చేయడం అనేది వైఎస్ జగన్ విజయంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎల్లో బ్యాచ్ ఏం సమాధానం చెబుతుంది. వైఎస్ జగన్ సర్కార్ ను ఊరికే విమర్శించడం, బురద జల్లడం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం జగన్ ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు.. రాష్ట్ర అభివృద్ధిని చూసి అయినా నోర్మూసుకోవాలి.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.