manipur hight court declares candidate in elections second Place as mla
మన దేశం ప్రజాస్వామ్యం చాలా అద్బుతమైనది. కాని దానికి ఉన్న కొన్ని లొసగులను ఉపయోగించుకుని కొందరు దాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ అడ్డ దారిలో అధికారంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తు ఉంటారు. ఎన్నికల్లో ఎవరికి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజేతగా నిలుస్తారు. ఒక్క ఓటు అధికంగా వచ్చినా కూడా గెలుపు వారిదే. కాని మన దేశంలోని ఒక అసెంబ్లీ నియోజక వర్గంలో నాలుగు వేల ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థికి 16 వేలు రాగా రెండవ స్థానంలో ఉన్న వ్యక్తికి 12 వేల ఓట్లు వచ్చాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూల కారణంగా 12 వేల ఓట్లు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు.
2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో హెన్రీ సింగ్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 16 వేలకు పై చిలుకు ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎరబోట్ కు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో హెన్రీ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని రోజులకు హెన్నీ తన నామినేషన్ అఫిడవిట్ లో హై కోర్టులో ఉన్న కేసును చూపించలేదు అంటూ బీజేపీ నాయకుడు కోర్టును ఆశ్రయించాడు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల సంఘంను మోసం చేసినందుకు గాను ఆయనపై అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే తనపై అనర్హత వేటు వేసినందున ఉప ఎన్నికలు నిర్వహించాలని హెన్రీ కోర్టును ఆశ్రయించాడు.
manipur hight court declares candidate in elections second Place as mla
హెన్రీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరకు ఉప ఎన్నికలు నిర్వహించడం కుదరదు అంటూ తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో హెన్రీ తన పదవిని వదులుకోవాల్సి రాగా సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అంటూ కోర్టు ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సెకండ్ ప్లేస్ లో నిల్చున్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా మన దేశంలోనే అవుతుందేమో అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…
Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…
Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా…
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…
Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…
Farmers : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది.…
This website uses cookies.