KCR : తెలంగాణలో వరుసగా ఎన్నికల భేరీ మోగుతోంది. సాగర్ ఉపఎన్నిక పూర్తయిందో లేదో… మునిసిపల్ ఎన్నికలకు తెరలేచింది. ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నిక. దీంతో రాజకీయ పార్టీలకు అసలు టైమే దొరకడం లేదు. ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొనగానే మరో ఎన్నిక రావడం… ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం.. ఇదే పని అయిపోతోంది. తాజాగా మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రధాన పార్టీలన్నీ ఇక సాగర్ ఉపఎన్నికను వదిలేసి.. వీటి మీద పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూడా ప్రధానంగా పోటీ అంటే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే.
రెండు మునిసిపిల్ కార్పొరేషన్లకు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు మునిసిపల్ కార్పొరేషన్ల అయిన వరంగల్, ఖమ్మం.. ఈ రెండు కూడా ప్రధానమైన నగరాలే. అలాగే… కొత్తగా ఏర్పాటయిన ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అన్నీ సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ నేతలు కూడా ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నారు.
తాజాగా… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… పురపాలక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు.. డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని… అందుకే మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలంటూ ఆమె కోరారు.
డబ్బులతో రాజకీయం ఎలా చేయాలో సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. ఆయన డబ్బులతో రాజకీయం చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అక్కడ బీజేపీ గెలుపు చూడలేకనే…. వందల కోట్లు ఖర్చు చేసి మరీ… రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నారు. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తుంటే… వరుసగా ఎన్నికలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే… వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ లో బీజేపీనే ప్రజలు గెలిపించబోతున్నారు. అలాగే… ఐదు మునిసిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు… అని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.