pawan kalyan says about assembly in kathipudi public meeting
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయిన విషయం తెలుసు కదా. ఆయన ఇవాళ కత్తిపూడిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి విజయయాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా తాను అసెంబ్లీలో అడుగుపెడతా అని నొక్కిమరీ చెప్పారు. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని నాపై కక్ష కట్టి 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో ఓడించారు. నాపై మీరు ఎంత కక్ష కట్టినా.. ఈసారి మాత్రం నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయలేరు. మీకు దమ్ముంటే ఈసారి నన్ను అడ్డుకోండి. సీఎం జగన్ మీకు దమ్ముంటే ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయండి.. అని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.
నన్ను కనీసం గాజువాకలో అయినా గెలిపించి ఉంటే నేను రుషికొండను అయినా కాపాడేవాడిని. ఆంధ్రుల హక్కు అమరావతి అని.. అమరావతే రాజధానిగా ఉంటుందని పవన్ ఈసందర్భంగా స్పష్టం చేశారు. అసలు అమరావతిలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దానికి కారణం ఎవరు.. రాజధాని మార్పు పేరుతో మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రచ్చ వల్లనే ఇదంతా. దీనికి ముమ్మాటికీ కారణం.. వైసీపీ ప్రభుత్వమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిపై కూడా కులముద్ర వేయడం దారుణమన్నారు.
pawan kalyan says about assembly in kathipudi public meeting
ఎన్నికల ముందు వైసీపీ ఏమని చెప్పింది. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక ఏం చేసింది. ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపై ఇప్పుడు ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. సీపీఎస్ రద్దు చేశామన్నారు. చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ.. మీరు చేతల్లో చేసిందేంటి. మా దగ్గర ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ.. జనసేనను టార్గెట్ చేసింది. అంటే మేము అంటే ఎంత భయమె అర్థం అవుతూనే ఉంది అని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీకి సరైన గుణపాఠం చెప్పేది జనసేన మాత్రమే అని పవన్ బల్లగుద్ది మరీ స్పష్టం చేశారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.