Non Veg : ప్రస్తుత కాలంలో ఆదివారం వచ్చింది అంటే చాలు కచ్చితంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే. అలాగే పండగ వచ్చినా, బంధువులు వచ్చినా ఈ నాన్ వెజ్ ను వండటం సాధారణంగా మారింది. మనలో ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. అలాంటి వాళ్ల అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. అయితే కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు అనే తేడా లేకుండా ఇలా అన్నిటి పంపకంలో కూడా యాంటీ బయాటిక్ వాడటం అధికంగా పెరిగింది. దీని వలన వాటిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్సి ఎక్కువైంది. ఈ విషయాలు అన్నీ కూడా అధికారుల పరిశోధనలు బయటపడ్డాయి. ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో మాంసాహారుల్లో ఆందోళన స్టార్ట్ అయింది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో 2019 నుండి 2022 మధ్యకాలంలో శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ లో పరీక్షించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాక పలు రకాల బ్యాక్టీరియా ఆనవాళ్ల పై కూడా పరిశోధనలు చేశారు. వీటిలో బర్రెలు మరియు ఆవులు తప్ప మిగిలిన అన్ని జంతువులలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ పరిశోధనలో తేలిన విషయంతో ప్రస్తుతం ఏమి తినాలి అన్న మాంసాహారులు భయపడుతున్నారు. అయితే మనోళ్లకు వారానికి ఒక్కసారైనా ముక్క మొట్టందే ముద్ద దిగదు. కానీ ఈ నాన్ వెజ్ లో యాంటీ బయాటిక్స్ చేరటంతో మనుషుల ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే ఇలా ఒక్కసారిగా మాంసాహారం తినే అలవాటును ఎవరు కూడా మార్చుకోలేరు. అలాగని వాటిని తిని రోగాల బారిన పడే ధైర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా నాన్ వెజ్ ప్రియులు దేనిని ఎంచుకుంటారో చూడాలి. ప్రస్తుత కాలంలో కోళ్ల పెంపకం అనేది ఫాస్ట్ గా జరిగెందుకు వాటికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని నిపుణులు తెలిపారు. అయితే ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినటువంటి కోళ్లను తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది అని వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ లాంటివి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు.
అయితే మీరు రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే, ఫారం లో పెంచే కోళ్లను కాకుండా ఇంట్లో పెంచుకునే కోళ్లను మాత్రమే తినాలి అని సూచిస్తున్నారు. ఈ స్టెరాయిడ్స్ లాంటివి లేని మాంసం తీసుకోవడం వలన ఆరోగ్య రక్షించుకోవచ్చు అని వైద్యులు అంటున్నారు. అయితే మాంసం విక్రెతలు నిబంధనలను పాటించేలా ర్యాండమ్ గా చెక్ చేస్తూ ఉంటాం అని ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఈ రూల్స్ ను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారి తెలిపారు. అయితే అమ్మటానికి పనికిరాని మరియు కుళ్ళిన మాంసాన్ని అమ్మినట్లయితే వాటికి సంబంధించిన దుకాణాలను మూసివేస్తామని కూడా తెలిపారు. అయితే వ్యాపారుల లాభపేక్ష వలన మార్కెట్లో దొరికే మాంసం విషం గా మారి అది తిన్నటువంటి వారి ప్రాణాలకు ముప్పు అనేది ఏర్పడుతుంది. అయితే జంతువుల క్వాంటిటీ కోసం క్వాలిటీ ని పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని అధికారులు ఉపేక్షించ రాదు అని మాంసాహార ప్రియులు కోరుతున్నారు…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కూడా రాశులకి అశుభ ఫలితాలు ఇస్తాయి. అయితే ఈసారి…
Liver : మన శరీరంలో కాలేయం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర…
RRC NCR : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్రాజ్, అప్రెంటీస్ల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది.…
Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ…
Green Tea : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి మరియు…
This website uses cookies.