Migraine : ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించట్లేదు. అంతే కాకుండా సరైన లైఫ్ స్టైల్ లేకపోవడంతో పాటు వ్యాయామాలు చేయకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో మైగ్రేన్ నొప్పి కూడా ఉంది. ఇది నాడీ సంబంధిత సమస్య. ఇది ఒక గంట నుంచి మొదలు పెడితే.. 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇందులో రోగి తలనొప్పితో పాటు కడుపు సమస్యలు, వికారం, వాంతులు మొదలైన వాటితో బాధపడవచ్చు. అయితే మైగ్రేన్ తో బాధపడుతుంటే.. వేసవిలో వీటిని అస్సలు తినొద్దు. అవేంటో తెలుసుకుందాం.
చాలామంది కాఫీ లేకుండా రోజు గడపలేరు. అయితే కాఫీ తాగితే మైగ్రేన్ నొప్పి ఆల్రెడీ ఉన్న వారికి అది ఇంకా ఎక్కువ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు తలనొప్పి తగ్గుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడు నరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.
ఈ రోజుల్లో చాక్లెట్ అనేది చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారిదాకా అందరూ తింటుంటారు. అయితే చాక్లెట్ లో ఉండే కెఫిన్, బీటా ఫెనిలేథైలమైన్ లాంటివి రక్తనాళాల్లో ఉద్రిక్తతను పెంచుతాయి. దాని వల్ల మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి చాక్లెట్లను తినకపోవడమే బెటర్.
ఎండాకాలంలో చల్లగా ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేరు. చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువనే అవుతుంది. వ్యాయామం చేసిన వెంటనే లేదంటే ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే మాత్రం మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.
సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే. నారింజ, కివి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తీసుకుంటే ఎండాకాలంలో చల్లదనం ఉంటుందని అంతా అనుకుంటారు. అయితే వీటిని తింటే మైగ్రేన్ నొప్పి అధికం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది నొప్పిని తీవ్రతరం చేస్తుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.