Breakfast : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఖ‌చ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Breakfast : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఖ‌చ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు ఇవే…!

Breakfast : సహజంగా అందరూ ఉదయాన్నే టీ, కాఫీలు టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.. అదేంటంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకునే ఆహార విధానంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉదయం తింటున్నారు. ఈ విధంగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అసలు మనం ఉదయం తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :2 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Breakfast : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఖ‌చ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు ఇవే...!

Breakfast : సహజంగా అందరూ ఉదయాన్నే టీ, కాఫీలు టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.. అదేంటంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకునే ఆహార విధానంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉదయం తింటున్నారు. ఈ విధంగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అసలు మనం ఉదయం తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మనం ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి పోషకాలు మనకు లభిస్తాయి.కొంతమంది ఉదయాన్నే వీటినీ తినడం ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటూ ఉంటారు అలాంటి ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

బిస్కెట్స్ అండ్ బ్రెడ్స్: కొంతమంది బిస్కెట్లు బ్రెడ్లు తింటూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. దీని వలన శక్తి తగ్గుతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ కూడా వస్తుంది. బిస్కెట్లు బ్రెడ్స్ తింటే తలనొప్పి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉదయాన్నే శక్తి తగ్గడంతో పాటు ఎస్టిటి సమస్యలు వస్తాయి.

పాన్ కేక్ : కొంతమంది ఉదయాన్నే పాన్ కేక్స్ తింటూ ఉంటారు. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి కానీ వీటిని తింటే శక్తి తగ్గుతుంది. వీటిని తినగానే ఇంకా స్వీట్ గ్రేవింగ్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.

జ్యూస్ లు : కొంతమంది ఉదయాన్నే జ్యూస్ లు తాగుతారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. జ్యూస్ చేసేటప్పుడు అందులో పీచు తగ్గిపోతుంది. ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచుతుంది. మీరు షుగర్ వేయకపోయినా దీనివల్ల బాడీలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. షుగర్ పేషెంట్స్ కి ఇది మంచిది కాదు. కాబట్టి పండ్లను జ్యూస్ చేయకుండా అలాగే తినేయాలి. ఇది కూడా ఏదైనా సాలిడ్ ఫుడ్ తీసుకున్నాక తినడం మంచిది..

టీ: ఉదయాన్నే టీ తాగితే కూడా అంత మంచిది కాదు. మీరు ఉదయాన్నే టీ తాగితే పోట్టలో యాసిడ్స్ పెరుగుతాయి. గుండెల్లో మంట నొప్పి మలబద్ధకం లాంటి సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి ఉదయాన్నే టీ తాగడం కూడా అంత మంచిది కాదు. ఉదయాన్నే ఏమైనా తినాలంటే ఫైబర్ పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం చాలా మంచిది. అంటే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఓట్స్ ,మొలకలు ఇలా మంచి ఫైబర్ ఉన్న పదార్ధాలు తినడం మంచిది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది