Millet Roti : చాలామంది రాత్రి సమయంలో రొట్టెలను తింటారు. కొంతమంది భోజనం లో అన్నం తో పాటు రొట్టెలను తీసుకుంటారు. రొట్టెల అలవాటు చాలామందికి ఉంటుంది. సహజంగా రొట్టె అంటే గోధుమపిండితో తయారు చేసేది అనుకుంటారు. దీని వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అనుకుంటారు కానీ ఈ గోధుమ రొట్టె తినడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో జీర్ణ సమస్య, చాతి గొంతు వంటి సమస్యలు ముఖ్యమని చెప్పాలి. ఇక ఈ గోధుమ పిండిలో అధిక ఫైబర్ ఉన్నందున దీనిని తీసుకొంటే జీర్ణ కావడం కష్టం అవుతుంది.అలాగే గోధుమలలో ఉండే గ్లూటైన్ కొంతమందికి సహకరించదు. దీనివలన జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అయితే ప్రతిరోజు రొట్టెలు తినే అలవాటు ఉన్నవారు గోధుమపిండికి బదులుగా ఇతర పదార్థాలతో తయారు చేసిన రొట్టెలను తినవచ్చు. అలాగే ఆరోగ్యానికి మేలును కలిగించే రొట్టెలను తినడం వలన ఆరోగ్యం మరింత బాగుంటుంది. మరి రొట్టెలను ఏ పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిని చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రొట్టెలు తినడం అలవాటు ఉన్నవారు గోధుమలకు బదులుగా తృణధాన్యాల తో చేసిన రొట్టెను తినడం మంచిది. అలాగే మిల్లెట్ ఓట్స్ మరియు బార్లీ పిండితో తయారుచేసిన రోటీలు తీసుకోవచ్చు.ఇలాంటి రోటీలు తినడం వలన బరువు అదుపులో ఉంటుంది. అలాగే పోషక లోపం ఉండదు.
అలాగే గోధుమ పిండికి బదులుగా శనగపిండిని కూడా ఉపయోగించుకోవచ్చు.శనగపిండి వలన బరువు నియంత్రణలో ఉండడం తో పాటు ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అదేవిధంగా జొన్న పిండితో చేసిన రొట్టెలు కూడా తినవచ్చు. జొన్న పిండిలో ఐరన్ ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనివలన సులభంగా జీర్ణం అవుతుంది.
అలాగే వాటితోపాటు మిల్లెట్స్ తో చేసిన రొట్టే తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో మెగ్నీషియం, ఐరన్, వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది తోడ్పడుతుంది. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరుకు సమాచారం ఆధారంగా జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.