Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పవన్ కోసం రాజకీయ ప్రచారాలలో పాల్గొంటూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వీడియోని షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ అనేవాడు అమ్మ గర్భం నుండి చివరిగా బయటకు వచ్చినప్పటికీ అందరికీ సహాయం చేయాలనే తత్వంలో ముందు ఉంటాడు. నా తమ్ముడు కళ్యాణ్ బాబుది తన తన గురించి కంటే ప్రజల మంచి గురించి ఆలోచించే తత్వం…
ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకుండానే తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చుపెట్టడం , సరిహద్దుల వద్ద ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే జవాన్లకు అందించడం, అలాగే మత్స్యకారులు ఇలా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాలోకి తాను బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి మాత్రం చాలా ఇష్టంగా వచ్చాడని జీరంజీవి తెలియజేశారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ళ వలనే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతుందని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తి శాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభల్లో పవన్ గొంతును మనం వినాలని , అది జరగాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి అందరికీి తెలిసిందే.
అయితే చిరంజీవి వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ…సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు పకోడీగాలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని అసలు మాట్లాడవద్దని చెబితే బాగుంటుందంటూ కొడాలి నాని తెలిపారు. మనకెందుకురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డాన్సులు , ఫైట్లు మన పని మనం చూసుకుందామని వాళ్లకి కూడా సలహా ఇస్తే బాగుంటుంది అంటూ తెలిపారు.మాకు అడ్డమైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీంతో ప్రస్తుతం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.