Anjeer : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది ఎంతో మందిని వేధిస్తుంది. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిందే. అందుకే దీనిని తగ్గించేందుకు రోజు అంజీర పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. అయితే రోజు రెండు అంజీర పండ్లను తినడం వలన బ్లడ్ షుగర్ అనేది అదుపులో ఉంటుంది అని అంటున్నారు. దీనితో పాటుగా క్యాన్సర్ మరియు గుండె సమస్యలు లాంటివి రాకుండా రక్షిస్తాయి అని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు ఈ అంజీర పండ్ల ను తినడం వలన ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు. అలాగే ఈ అంజీర పండ్లలో పొటాషియం పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే క్లోరోజైనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి…
అంజీరా పండ్ల లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అలాగే అత్తి పండ్లను తీసుకోవడం వలన శరీరంలో పెరిగినటువంటి ట్రైగ్లిజరైడ్ స్థాయిలో కూడా తగ్గుతాయి అని అంటున్నారు. అలాగే కరోనరీ ధమనులలో అడ్డంకులను కూడా నియంత్రిస్తుంది. దీంతో గుండె అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే వీటిని ప్రతిరోజు నిత్యం తీసుకోవడం వలన హార్మోన్ల అసమతుల్యత సమస్య అనేది తొలగిపోతుంది అని అంటున్నారు. ముఖ్యంగా మోనోపాజ్ టైంలో ఉన్న మహిళలు మరియు రుతుక్రమ సమస్యతో బాధపడే అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యత సమస్యల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. కాబట్టి వీరంతా రోజు అంజీర పండ్లను తీసుకుంటే మంచిది అని అంటున్నారు…
రోజు రాత్రి పడుకునే ముందు రెండు అంజీర పండ్లను నాడబెట్టుకోవాలి. వీలైతే వాటిలో బాదం మరియు వాల్ నట్స్ కూడా వేసి నానబెట్టుకోవచ్చు. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన అద్భుతమైన ప్రయోజనాల పొందవచ్చు అని అంటున్నారు. అలాగే ఈ అంజీర పండ్లతో మలబద్దక సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు. అయితే మలబద్ధక సమస్యతో బాధపడే వారు రోజు రెండు నానబెట్టిన అంజీర పండ్లను ఖాళీ పరిగడుపున తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పేగు కదలికలను సరిచేసి మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. అలాగే పొట్ట ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది అని అంటున్నారు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
Blood : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి. అయితే…
Job : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…
Tongue : మన కళ్ళు పసుపు రంగులో మారిన లేక చర్మం పసుపు రంగులోకి మారిన కామెర్ల వ్యాధికి సంకేతం గా…
Pitru Paksha : సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అని పిలుస్తారు. ఇక…
This website uses cookies.