Ghee : వర్షాకాలం వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలోనే ఆరోగ్య పై దృష్టి పెట్టాలి. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని ఇమ్యూనిటీ బలాన్ని పెంచుకోవాలి. అందులో ముఖ్యమైనది నెయ్యి. దీనిని ప్రతిరోజు వన్ టీ స్పూన్ తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…..
ఇమ్యూనిటీ పెరగాలంటే నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో కొవ్వులు కరిగించే విటమిన్ డీ , కే ,ఈ ఉంటాయి. అదేవిధంగా నెయ్యిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే నెయ్యి ఇతర ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
ఈ సీజన్ లో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్యాస్ , అసిడీటీ వంటి సమస్యలకు నెయ్యి గొప్ప ఔషధంగా చెప్పుకోవచ్చు. ఉదయం గ్లాస్ గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది . అదేవిధంగా ఇందులో ఉండే బ్యుట్రిక్ యాసిడ్ ను పెద్ద పెగు కణాలు తమకు ఇష్టమైన శక్తివనరుగా వాడడం జరుగుతుంది.
జుట్టు చర్మానికి నెయ్యి చాలా మంచిది. ఇది వర్ష కాలంలో చాలా ఉపయోగపడుతుంది. నెయ్యిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే నెయ్యిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఇక నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అయితే ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ ఎక్కువ మోతాదులు తీసుకుంటే మాత్రం కచ్చితంగా హాని జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆహారమైన మితంగా తీసుకోవడం మంచిది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.