Vitamin D And B12 : శరీరంలో విటమిన్ బి12 - డి ఎందుకు ముఖ్యం... ఇవి లేకపోతే ఏం జరుగుతుంది...!
Vitamin D And B12 : శరీరానికి విటమిన్లు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి లేకపోతే శరీరం అనారోగ్యానికి గురవుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే శరీరంలో ఉండే ప్రతి విటమిన్ కూడా అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా విటమిన్ బి12 మరియు విటమిన్ డి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్లు అని చెప్పాలి. శరీరంలో ఈ రెండు విటమిన్ల లోపం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ లోపాలతో బాధపడేవారు వెంటనే వాటి స్థాయిని పెంచే దిశగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఈ విటమిన్స్ శరీరానికి ఎంత ఉపయోగం.. ఈ విటమిన్స్ లోపం ఏర్పడితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడినట్లైతే అది నాడీ వ్యవస్థ మరియు నరాలను బలహీనంగా చేస్తుంది. అలాగే విటమిన్ డి లోపం ఏర్పడినట్లైతేే ఎముకలలో బలం లేకుండా పోతుంది. తద్వారా చిన్న బరువులకు సైతం ఎముకలు విరుగుతాయి. కావున ఇలాంటి అజాగ్రత్త సమస్యలకు దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ఈ రెండు విటమిన్స్ పుష్కలంగా కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఆరోగ్య నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం విటమిన్ బి12 మరియు విటమిన్ డి సప్లిమెంట్లను అనేకసార్లు తీసుకున్నప్పటికీ శరీరంలో వాటి స్థాయి అనేది పెరగదు. కావున ఎలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు.ఒకవేళ ఈ రెండు విటమిన్లు లోపం ఉన్నట్లయితే సప్లిమెంట్స్ తీసుకొని తిరిగి ఆ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విటమిన్ ల లోపంతో బాధపడేవారు సప్లిమెంట్స్ తీసుకోవడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఒకటి ఉంది. ఇక ఈ సప్లిమెంట్స్ ను రోజులో కేవలం ఒకే సమయంలో మాత్రమే తీసుకుంటే శరీరం వాటి నుండి ప్రయోజనాలను పొందగలుగుతుంది. తద్వారా దుష్ప్రభావాలు కూడా తగ్గిపోతాయి.
Vitamin D And B12 : శరీరంలో విటమిన్ బి12 – డి ఎందుకు ముఖ్యం… ఇవి లేకపోతే ఏం జరుగుతుంది…!
విటమిన్ బి 12 తో పాటువ విటమిన్ బి1, బి2 బి6 కూడా నీటిలో కరిగే విటమిన్లు.అలాగే విటమిన్ సి కూడా నీటిలో కరిగి పని చేస్తుంది. అయితే ఈ విటమిన్లు అన్నీ కూడా కాళీ కడుపుతో బాగా గ్రహించబడతాయి. కావున ఈ విటమిన్ల లోపాలతో బాధపడేవారు అల్పాహారానికి గంట ముందు లేదా గంట తర్వాత వీటిని తీసుకోవడం మంచిది. తద్వారా శరీరం కూడా ముఖ్యమైన విటమిన్లను గరిష్టంగా పొందగలుగుతుంది.
విటమిన్ డి అనేది కొవ్వులతో కరిగేది కాబట్టి శరీరంలో ఆహారం లేదా కొవ్వు ఉన్నప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది. కావున ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత దీనిని తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
This website uses cookies.