Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?
Mangoes : వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండు మామిడి. ఇది వేసవి కాలంలో దొరికే మంచి పోషకాలు ఉన్న పండు. అందుకే మామిడిని చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ తింటుంటారు. కాగా మామిడి పండ్లను ఇంత మండే వేసవిలో తినేందుకు కూడా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. అయితే మామిడి పండ్లను తినేముందు కొంతమంది నేరుగానే తినేస్తుంటారు. ఇలా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మామిడి పండ్లపై ఎన్నో మలినాలు కూడా ఉంటాయి.
ఈ మధ్య మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిలువ ఉంచేందుకు కొన్ని రసాయనాలను కూడా వాటిపై అప్లై చేస్తున్నారు. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం. ఇవి శ్వాస సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, జీర్ణ సంబంధిత సమస్యలను తీసుకొస్తున్నాయి. అందుకే మామిడి పండ్లను తినే ముందు అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే మామిడి పండ్లపై ఉండే రసాయనాలు తొలగిపోతాయి. దాంతో పాటు వాటిపై ఉండే రకరకాల వైరస్ లు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వేసవికాలంలో బాడీని చల్లగా ఉంచుకుంటేనే చాలా బెటర్.
Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?
కాబట్టి మామిడికాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం. మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అయితే మామిడి కాయలను తినే ముందు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తొక్కలోని ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. వీటితో పాటు తొక్కలో ఉండే హానికరమైన పదార్థాలు కూడా తొలగిపోతాయి.
ఇలా ఎన్నో రకాల అనారోగ్యకరమైన వాటిని మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే తొలగిపోతాయి. కాబట్టి మామిడి పండ్లను తినే సమయంలో నీటిలో నానబెట్టుకుని తింటే చాలా మంచిదని అంటున్నారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.