It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం ... డిప్రెషన్ నుంచి బయటపడేదెలా...?
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణం ఒత్తిడి వలన అని చెబుతున్నారు మానసిక వైద్యులు. కంపెనీలలో పరుగులు పెట్టేలా ఉండే వాతావరణం,ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయంటున్నారు మానసిక వైద్యులు.
It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?
బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా చేసే పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు ఎక్కువ ఒత్తిడికి గురవుడం మనకి తెలిసినదే. ఎక్కువ సేపు కూర్చొని గంటలు తరబడి పనిచేయడం, సమయానికి పనులు పూర్తి చేయాలి అనె ఒత్తిడి,ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం, అన్ని కలిసి ఉద్యోగస్తులకు కష్టమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, వారు మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు.
ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులు ఆందోళన, డిప్రెషన్ కి గురవడం,బాగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.ఒంటరిగా ఫీల్ అవుతూ, తమ ఉద్యోగాల్లోని ఒత్తిడిని తట్టుకోలేక పోతారు. అందుకే,ఐటీ పరిశ్రమలో ఆత్మహత్యల సంఖ్య చాలా పెరుగుతూ వస్తుంది.
సహాయం చేసే వ్యవస్థల అవసరం : పనిచేసే చోటా సరైన సహాయం చేసే వ్యవస్థను ఉండటం చాలా అవసరం. కంపెనీలు ఉద్యోగాలలో ఒత్తిడి కౌన్సిలింగ్ అందించాల్సిన అవసరం కూడా ఉంది.అయితే, ఉద్యోగులకు నచ్చినట్లుగా పనిచేసుకునే అవకాశం ఇవ్వాలి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఒత్తిడి తగ్గి వారికి ఆత్మహత్యలు కారణం కాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లేదంటే వాళ్లు తీవ్రమైన డిప్రెషన్ అంటే ఆందోళనలో పడే ప్రమాదం ఉంది.
కంపెనీలు, ప్రభుత్వాల పాత్ర : ఉద్యోయోగం చేసే వారిలో విపరీతంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పరిష్కరించడంలో కంపెనీలు ముఖ్యమైన పాత్రను పోషించాలంటున్నారు నిపుణులు. ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి, పనికి మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి ప్రభుత్వ ఉద్యోగాలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చట్టాలు తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ రంగంలో మార్పులు రావడానికి వీలుంటుంది.
మార్పు రావాలి : ప్రస్తుతం ఐటి ఉద్యోగాలు చేస్తున్న యువతి,యువకులలో ఆత్మహత్యలు పెరగడం వారిలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక ఆందోళన స్పష్టంగా చూపిస్తుంది. భారత టెక్ రంగంలో తగిన సహాయం చేసే వ్యవస్థలు, సరైన విధానాలు ఉంటే పని ఒత్తులు తగ్గించవచ్చు. ఐటి ఉద్యోగులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒత్తిడిని తగ్గించుకోనేందుకు యోగ, మెడిటేషన్ చేసుకోవాలి.వారి జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు, ప్రభుత్వాలు కూడా వారి కోసం సహకారాన్ని అందించాలని ముఖ్యంగా కంపెనీల పని విధానాలలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు నిపుణులు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.