
It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం ... డిప్రెషన్ నుంచి బయటపడేదెలా...?
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణం ఒత్తిడి వలన అని చెబుతున్నారు మానసిక వైద్యులు. కంపెనీలలో పరుగులు పెట్టేలా ఉండే వాతావరణం,ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయంటున్నారు మానసిక వైద్యులు.
It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?
బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా చేసే పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు ఎక్కువ ఒత్తిడికి గురవుడం మనకి తెలిసినదే. ఎక్కువ సేపు కూర్చొని గంటలు తరబడి పనిచేయడం, సమయానికి పనులు పూర్తి చేయాలి అనె ఒత్తిడి,ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం, అన్ని కలిసి ఉద్యోగస్తులకు కష్టమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, వారు మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు.
ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులు ఆందోళన, డిప్రెషన్ కి గురవడం,బాగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.ఒంటరిగా ఫీల్ అవుతూ, తమ ఉద్యోగాల్లోని ఒత్తిడిని తట్టుకోలేక పోతారు. అందుకే,ఐటీ పరిశ్రమలో ఆత్మహత్యల సంఖ్య చాలా పెరుగుతూ వస్తుంది.
సహాయం చేసే వ్యవస్థల అవసరం : పనిచేసే చోటా సరైన సహాయం చేసే వ్యవస్థను ఉండటం చాలా అవసరం. కంపెనీలు ఉద్యోగాలలో ఒత్తిడి కౌన్సిలింగ్ అందించాల్సిన అవసరం కూడా ఉంది.అయితే, ఉద్యోగులకు నచ్చినట్లుగా పనిచేసుకునే అవకాశం ఇవ్వాలి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఒత్తిడి తగ్గి వారికి ఆత్మహత్యలు కారణం కాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లేదంటే వాళ్లు తీవ్రమైన డిప్రెషన్ అంటే ఆందోళనలో పడే ప్రమాదం ఉంది.
కంపెనీలు, ప్రభుత్వాల పాత్ర : ఉద్యోయోగం చేసే వారిలో విపరీతంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పరిష్కరించడంలో కంపెనీలు ముఖ్యమైన పాత్రను పోషించాలంటున్నారు నిపుణులు. ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి, పనికి మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి ప్రభుత్వ ఉద్యోగాలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చట్టాలు తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ రంగంలో మార్పులు రావడానికి వీలుంటుంది.
మార్పు రావాలి : ప్రస్తుతం ఐటి ఉద్యోగాలు చేస్తున్న యువతి,యువకులలో ఆత్మహత్యలు పెరగడం వారిలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక ఆందోళన స్పష్టంగా చూపిస్తుంది. భారత టెక్ రంగంలో తగిన సహాయం చేసే వ్యవస్థలు, సరైన విధానాలు ఉంటే పని ఒత్తులు తగ్గించవచ్చు. ఐటి ఉద్యోగులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒత్తిడిని తగ్గించుకోనేందుకు యోగ, మెడిటేషన్ చేసుకోవాలి.వారి జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు, ప్రభుత్వాలు కూడా వారి కోసం సహకారాన్ని అందించాలని ముఖ్యంగా కంపెనీల పని విధానాలలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు నిపుణులు.
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
This website uses cookies.