It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం ... డిప్రెషన్ నుంచి బయటపడేదెలా...?
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణం ఒత్తిడి వలన అని చెబుతున్నారు మానసిక వైద్యులు. కంపెనీలలో పరుగులు పెట్టేలా ఉండే వాతావరణం,ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయంటున్నారు మానసిక వైద్యులు.
It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?
బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా చేసే పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు ఎక్కువ ఒత్తిడికి గురవుడం మనకి తెలిసినదే. ఎక్కువ సేపు కూర్చొని గంటలు తరబడి పనిచేయడం, సమయానికి పనులు పూర్తి చేయాలి అనె ఒత్తిడి,ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం, అన్ని కలిసి ఉద్యోగస్తులకు కష్టమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, వారు మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు.
ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులు ఆందోళన, డిప్రెషన్ కి గురవడం,బాగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.ఒంటరిగా ఫీల్ అవుతూ, తమ ఉద్యోగాల్లోని ఒత్తిడిని తట్టుకోలేక పోతారు. అందుకే,ఐటీ పరిశ్రమలో ఆత్మహత్యల సంఖ్య చాలా పెరుగుతూ వస్తుంది.
సహాయం చేసే వ్యవస్థల అవసరం : పనిచేసే చోటా సరైన సహాయం చేసే వ్యవస్థను ఉండటం చాలా అవసరం. కంపెనీలు ఉద్యోగాలలో ఒత్తిడి కౌన్సిలింగ్ అందించాల్సిన అవసరం కూడా ఉంది.అయితే, ఉద్యోగులకు నచ్చినట్లుగా పనిచేసుకునే అవకాశం ఇవ్వాలి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఒత్తిడి తగ్గి వారికి ఆత్మహత్యలు కారణం కాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లేదంటే వాళ్లు తీవ్రమైన డిప్రెషన్ అంటే ఆందోళనలో పడే ప్రమాదం ఉంది.
కంపెనీలు, ప్రభుత్వాల పాత్ర : ఉద్యోయోగం చేసే వారిలో విపరీతంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పరిష్కరించడంలో కంపెనీలు ముఖ్యమైన పాత్రను పోషించాలంటున్నారు నిపుణులు. ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి, పనికి మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి ప్రభుత్వ ఉద్యోగాలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చట్టాలు తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ రంగంలో మార్పులు రావడానికి వీలుంటుంది.
మార్పు రావాలి : ప్రస్తుతం ఐటి ఉద్యోగాలు చేస్తున్న యువతి,యువకులలో ఆత్మహత్యలు పెరగడం వారిలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక ఆందోళన స్పష్టంగా చూపిస్తుంది. భారత టెక్ రంగంలో తగిన సహాయం చేసే వ్యవస్థలు, సరైన విధానాలు ఉంటే పని ఒత్తులు తగ్గించవచ్చు. ఐటి ఉద్యోగులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒత్తిడిని తగ్గించుకోనేందుకు యోగ, మెడిటేషన్ చేసుకోవాలి.వారి జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు, ప్రభుత్వాలు కూడా వారి కోసం సహకారాన్ని అందించాలని ముఖ్యంగా కంపెనీల పని విధానాలలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు నిపుణులు.
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
This website uses cookies.