వేరుశెనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో పలు వంటకాలు చేసుకుంటారు. తీపి, కారం రెండు రకాల వంటకాల్లోనూ వేరుశెనగలను ఉపయోగిస్తారు. అయితే వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి అవసరమే. ఈ క్రమంలోనే వేరుశెనగలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేరుశెనగల్లో అనేక రకాల శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. రిస్వరెట్రాల్, ఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్స్, ఆర్గైనైన్, ఫైటో స్టెరాల్స్ ఉంటాయి. ఇవి పోషణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
2. వేరుశెనగలను రోజూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. 2013లో పలువురు సైంటిస్టులు ఈ అంశంపై అధ్యయనం చేపట్టారు. రోజూ వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందని, అధిక బరువు తగ్గుతారని తేల్చారు. అందువల్ల వీటిని తింటే అధిక బరువు తగ్గుతారు.
3. వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
4. వేరుశెనగల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. శక్తిని అందిస్తాయి. కణాలను మరమ్మత్తు చేస్తాయి.
5. వేరుశెనగలను రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
6. వేరుశెనగల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు వయస్సు మీద పడే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.
వేరుశెనగలను తినడం వల్ల కొందరిలో అలర్జీలు వస్తాయి. కనుక అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. ఇక మిగిలిన ఎవరైనా సరే వేరుశెనగలను రోజూ తినవచ్చు.
Jeera Water : మన వంటింట్లోనే నిక్షిప్తమై ఉన్నానా వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కానీ వీటిని చాలామంది…
Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…
Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…
TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…
Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుండడంపై…
Kavitha Revanth Reddy : కేసీఆర్కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…
This website uses cookies.