Categories: HealthNews

Bacteria : వామ్మో… మనిషిని తినే బ్యాక్టీరియా… 48 గంటల్లోనే మారడం… ఈ వ్యాధి లక్షణాలివే…!

Advertisement
Published by
Advertisement

Bacteria  : మనిషి తినే బ్యాక్టీరియాఇది చాలా డేంజరస్. 48 గంటల్లోనే మరణం ఖాయం. అవును. మనిషిని తినే ప్రాణాంతక బ్యాక్టీరియా ప్రస్తుతం జపాన్ లో వ్యాపిస్తూ ఉన్నది. ఈ వ్యాధి అనేది నగరాలలో ఎంతో వేగంగా విస్తరించటం వలన జపాన్ ఎంతో షాక్ అవుతుంది. ఇంతకీ అసలు మనిషిని తినే బ్యాక్టీరియా ఏంటి. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రెండు రోజులలో మనిషిని చంపే డేంజరస్ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు జపాన్ లో వేగంగా వ్యాపిస్తూ ఉంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ లోని టోక్యోలో ఎంతో వేగంగా విజృంభిస్తూ ఉంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా ఇది. కరోనా కంటే డేంజరస్ గా ఉన్నది. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ అనేది వణుకుతుంది. మనిషి మాంసాన్ని తిని బ్రతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్ లో రోజు రోజుకు ఎంతగానో పెరుగుతూ ఉన్నాయి. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ ప్రకారం చూసినట్లయితే, జూన్ రెండు నాటికి 977 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ బ్యాక్టీరియా కేసులు అనేవి గత ఏడాది మొత్తం 941 నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం వలన మరింత భయందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్య లోని 145 కేసులు నమోదు అయినట్లుగా స్థానిక మీడియా తెలిపింది.

Advertisement

ఇక ఈ వ్యాధి లక్షణాలను పరిశీలించినట్లయితే సాధారణంగా గొంతు నొప్పి మరియు వాపు లాంటి తేలిక పాటి అనారోగ్య లక్షణాలతో ప్రారంభం అవుతుంది. కానీ ప్రతిరోజు క్రమంగా శరీరంలోని అవయవాలను నొప్పి, వాపు జ్వరం, లోబీపీ,శరీర కణజాలాన్ని చంపి నెక్రోసిన్ లాంటి తీవ్రమైన లక్షణాలు కలిగి ఉన్నది. ఈ వ్యాధి అనేది వ్యాపించి తరువాత అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి కూడా దారి తీస్తున్నాయి. ఈ వ్యాధి కేసుల 30 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా నమోదవుతుండటం వలన 50 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం ప్రమాదకరంగా మారింది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతూ ఉన్నట్లుగా జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక రోజు ఉదయం పాదంలో వాపు గమనిస్తే మధ్యాహ్ననానికి మోకాలి వరకు వ్యాపిస్తూ ఉన్నది. దాని తర్వాత 48 గంటల లోపే మరణిస్తున్నారని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కి కూచి తెలిపారు. ఈ లెక్కన STSS బ్యాక్టీరియా ఎంత ప్రమాదమో తెలుస్తూ ఉన్నది కదా. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30% ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు. ప్రొఫెసర్ కెన్ కి కూచి.

Advertisement

రోగుల పేగుల్లో జీవనం మలం ద్వారా కలుషితం : ఈ బ్యాక్టీరియా అనేది ఎంతో ప్రాణాంతకమైనది. ఇది రోగుల పేగులలో జీవిస్తూ ఉంది. మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుంది అన్నారు ప్రొఫెసర్ కెన్ కికూచి. ఈ తరుణంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే ఒంటిపై గాయాలు ఉన్నవారు కూడా వెంటనే చికిత్స చేయించుకోవాలి అని సూచించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల ప్రకారం చూస్తే,ఈ సంవత్సరం జపాన్ లో కేసుల సంఖ్య 2500కి చేరుకోవచ్చు అని మరణాల రేటు కూడా భయంకరంగా ఉంది అని ప్రొఫెసర్ కెన్ కికూచి తెలిపారు. మరొక వైపు సుమారు 5 ఐరోపా దేశాలు 2022లో ఈ STSS తో కూడినటువంటి ఇన్వాసిన్వ్ గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ వ్యాధి కేసుల పెరుగుదలను గుర్తిస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులో కోవిడ్ ఆంక్షలు ముగిసిన తర్వాత ఈ కేసులు పెరిగాయి అని WHO తెలిపింది. మొత్తంగా ఈ మనిషిని తినే బ్యాక్టీరియా జపాన్ లో తీవ్ర కల్లోలం రేపింది. అయితే టోక్యోలో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరిక నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్ కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి…

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Gold : అదిరిపోయే ఆఫర్లు .. రూ.1 నుంచే బంగారం కొనుగోలు అవకాశం .. ఎలాగో తెలుసా ..?

Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…

33 minutes ago

Mangoes : మామిడి పండ్లు బాగా తింటున్నారా? .. అయితే ఈ విషయాలు తెలుసుకోండి .. లేదంటే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే ..!

Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…

2 hours ago

Tea : టీకి ముందు నీళ్లు తాగాలా? .. లేక తాగిన తర్వాతనా? .. అసలు నిజం ఇదే..!

Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…

4 hours ago

Millet Breakfast : ఉదయం అలసటకు చెక్ .. మిల్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఇక రోజంతా ఫుల్ ఎనర్జీ..!

Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…

5 hours ago

BPCL : నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం .. నెలకు రూ.1,40,000 వరకు వేతనంతో ఉద్యోగాలు .. వివరాలివే ..!

BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…

14 hours ago

Aadhaar Card : ఆధార్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక ప్రకటన .. జూన్‌ 14 వరకే గడువు..!

Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…

16 hours ago

PM Modi : బెంగాల్‌లో మోడీ స్ట్రాటజీ .. సెంటిమెంట్‌తో సింపుల్ సర్‌ప్రైజ్ ..!

PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…

17 hours ago

Samantha : నేను తప్పు చేయలేదు .. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా .. విడాకులకు కారణం అదే .. ?

Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…

19 hours ago

Airtel : మొబైల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌ .. ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల పెంపు ..!

Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…

20 hours ago

CM Chandrababu : కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణమాఫీ .. రైతులకు సీఎం బంపర్ ఆఫర్ ..!

CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…

22 hours ago

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వ శుభవార్త .. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు .. రూ.5 లక్షల సాయం ..!

Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…

23 hours ago

Rythu Bharosa : రైతన్నలకు గుడ్‌న్యూస్ .. మరికొన్ని గంటల్లో ఖాతాల్లోకి నగదు ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…

1 day ago