
Revanth Reddy : వై.ఎస్ జగన్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్... ఇలా చేస్తే కష్టమే కదా...!
Revanth Reddy : రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరే విజయాలు పరాజయాలు అనేవి సహజంగా ఉంటాయి. అయితే వాస్తవానికి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అసలు ఏమీ చేయలేదంటే పొరపాటే. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వం చేయని వాటిని జనాల్లోకి తీసుకువెళ్తారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతిపక్షాలు ఎక్కడ చెప్పవు కానీ చేయని వాటి గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజల్లో సింపతి పొందే రాజకీయ ప్రయత్నం ఇది. మరి ప్రభుత్వం చేసిన మంచిని ఎవరు చెప్పుకోవాలి అంటే తాము చేసిన మంచిని తామే చెప్పుకోవాలని పెద్దలు అంటున్నారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మూడు దశాబ్దల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఘోరంగా పరాజయం పాలయింది. అయితే దీనికి గల ముఖ్య కారణం ఆమె చేసిన మంచి గురించి ఆమె చెప్పుకోకపోవడం. దానిని అనువుగా మలుచుకున్న విపక్షాలు ఆమె చేయని వాటిని గురించి విమర్శలు చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లారు.
ఇక ఇలాంటి తప్పే చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా చేశారు. ప్రభుత్వం చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పకుండా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ప్రజలకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని వైసిపి అధినాయకత్వం ఊరుకుంది. కానీ చివరకు విపక్షాలు దీనిని బాగా వాడుకొని అధికారంలోకి వచ్చాయని చెప్పాలి.
ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు చూసినట్లయితే జగన్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని పలువురు అంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అధికారం చేపట్టిన తర్వాత రోజు నుండే ప్రభుత్వం పై విమర్శలుపెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎవరికి టైం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదంటూ ప్రచారాలు చేస్తున్నాయి.
Revanth Reddy : వై.ఎస్ జగన్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్… ఇలా చేస్తే కష్టమే కదా…!
మరి 6 నెలల వ్యవధిలో రేవంత్ ప్రభుత్వం ఏమి చేయలేదా అనే విషయానికి వస్తే…కేవలం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మూడు పెద్ద పథకాలను సర్కార్ అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం అలాగే మరో రెండు కీలక హామీలను నెరవేర్చారు. అయినప్పటికీ విపక్షాలు రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలుు చేయడంతో దాని ప్రభావం జనాల మీద బాగా పడిందని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లను సాధించిందంటూ చెప్పుకొస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలను తెలియజేయాలని పలువురు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు తెలియదని , ఇది రాబోయే ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తుందని చెబుతున్నారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.