Lose Weight : సగ్గు బియ్యం అనేవి దాదాపు అందరూ ఇళ్లల్లో ఉంటాయి. అయితే ఇవి తెల్లగా ముత్యాల మాదిరిగా మెరుస్తూ ఉన్న ఈ సగ్గుబియ్యం లో ఎన్నో ఆరోగ్య పోషకాలు దాగి ఉన్నాయి. అయితే వీటికి సొంత రుచి అంటూ లేకపోవడంతో ఇతర రకాల ఆహార పదార్థాల తో కలిపి తీసుకుంటూ ఉంటాం. అనగా పండ్లు, మసాలాలు, కిచిడి లాంటివి తయారు చేసుకొని తింటూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే. ఉపవాసం విరమించిన తర్వాత సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని తినెందుకు ఎంతో ఇష్టపడతారు. అయితే అప్పుడప్పుడు తీసుకునే సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని ప్రతినిత్యం గంజీ రూపంలో తీసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది అని వైద్య నిపుణులు తెలిపారు. సగ్గుబియ్యం లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ సగ్గుబియ్యం మంచి ఫుడ్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే. మహిళలకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది…
ఒక కప్పు సగ్గుబియ్యం లో 544 కేలరీలు, 135 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఈ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం,ఐరన్,కాల్షియం లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినడం వలన శరీరంలో పోషకాహార లోపం అనేది ఉండదు. ఎక్కువగా శరీరంలో పని చేసేందుకు వెంటనే శక్తిని, సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ ఆహారం అనేది బరువును తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. దీనిలో ఫైబర్ అనేది అధిక మోతాదులో ఉంటుంది. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు అధిక శాతం లో ఉండటం వలన ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీంతో ఆకలి అనేది ఉండదు. దీనిలో ఉండే ఫైబర్ జీవక్రియను పెంచేందుకు కూడా ఎంతో బాగా పని చేస్తుంది. కాబట్టి సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వలన తొందరగా బరువు తగ్గుతారు. అయితే మీరు మధ్యాహ్నం వేళలో అన్నం లేక చపాతీలు తినటం మానేసి సగ్గుబియ్యంతో చేసిన కిచిడిని తీసుకోవటం మంచిది. దీనిలో కార్బోహైడ్రేట్లో ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోవటం వలన పని చేసే సామర్ధ్యం కూడా వస్తుంది.అలాగే అలసట మరియు బలహీనతతో ఉన్న టైంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా సగ్గుబియ్యంతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు..
ప్రస్తుత కాలంలో చాలా మంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కోసం చూస్తూ ఉంటారు. అయితే గ్లూటెన్ రహిత ఆహారం తినడం వలన బరువు తొందరగా తగ్గొచ్చు. అంతేకాక మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. ఈ సందర్భంలో మీరు సగ్గుబియ్యాన్ని ఎంచుకోవచ్చు. వీటిని తీసుకోవడం వలన మీ శరీరంలో గ్లూటెన్ చేరే అవకాశం అసలు ఉండదు. ఈ సగ్గుబియ్యం అనేది గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైన ఆహారం అని చెప్పొచ్చు. ఈ ఆహారం లో ఫొలేట్ అనేది ఉంటుంది. ఈ పోషకాలు అనేవి గర్భధారణ టైంలో రక్తహీనత సమస్యలు తగ్గిస్తుంది. అలాగే పిండం పెరుగుదల మరియు ఆరోగ్యన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది తల్లి యొక్క పాలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది రుతుస్రావ టైం లో ఇతర శారీరక సమస్యలను కూడా నియంత్రిస్తుంది. రక్తహీనత సమస్యలు తగ్గించేందుకు మహిళలు ప్రత్యేకంగా ఎంతో ఉపయోగకరమైన ఈ సగ్గుబియ్యాన్ని సరైన శరీర బరువును మెయింటైన్ చేయటంలో కూడా ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రక్తహీనత తగ్గాలి అన్న కూడా వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది…
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.