Categories: HealthNewsTrending

Multani Mitti : చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించండి..!

Advertisement
Advertisement

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

this is how multani mitti helps to get rid of face skin problems

1. ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది.

Advertisement

2. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తగ్గుతుంది.

Advertisement

3. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.

4. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్‌ స్పూన్‌ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

5. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు.

6. చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

1 hour ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

2 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

2 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

3 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

4 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

4 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

5 hours ago