Fruit or Juice : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదో అందరికీ తెలుసు. అయితే కొందరు డైరెక్టుగా పండ్లు తింటారు. మరి కొందరు జ్యూస్ లాగా చేసుకొని తాగుతుంటారు. అయితే రెండు పండ్లతో తయారుచేసినప్పటికీ రెండింటిలోను పోషకాల మధ్య చాలా తేడా ఉంటుంది. అయితే వైద్యులు జ్యూస్ కంటే పండ్లను తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఒక గ్లాసు జ్యూస్ త్రాగి రోజున ప్రారంభించడం ఆరోగ్యకరమైన మార్గంగా చెబుతున్నారు. పండ్ల రసాలలో చక్కెర ఎక్కువగా , ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉండవు. అందుకే పండ్లను రసం కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడింది.
ఫైబర్ మన శరీరానికి చాలా అవసరం. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. కానీ పండ్లకు బదులుగా జ్యూస్ తాగినప్పుడు అందులోని ఫైబర్ అంతా ఫిల్టర్ అవుతుంది. దీని వలన శరీరానికి కావలసిన ఫైబర్ అందదు. కాబట్టి జ్యూస్ కంటే పండ్లు తినటమే మంచిది అని వైద్యులు అంటున్నారు. అలాగే పండ్ల రసాలను వివిధ ప్రాసెస్ ల ద్వారా తయారు చేస్తూ ఉంటారు. దీనివలన ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి వంటి సూక్ష్మ పోషకాలు పోతాయి. అందుకే ఎక్కువగా పండ్లు తినమని వైద్యులు సూచిస్తున్నారు.
పండ్లను తినడం వలన కడుపు నిండుగా ఉండడంతో పాటు పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు. జ్యూస్ తాగితే కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు. అందుకే సాధ్యమైనంత వరకు పండ్లను తినాలని వైద్యులు పేర్కొంటున్నారు. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. జ్యూస్ రూపంలో తీసుకుంటే క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే అందులో పండ్ల రసం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్యాక్ చేసిన జ్యూస్ త్రాగితే అందులో చక్కెరను జోడించడం వలన క్యాలరీలు మరింతగా పెరుగుతాయి.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.