
Yoga : నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు... ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే...!
Yoga : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి అధిక రక్త పోటు. ఈ సమస్య అనేది ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. అలాగే గుండె మరియు మెదడు, మూత్రపిండాలు లాంటి ముఖ్యమైన అవయవాలపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కనుక మన రోజువారి దిన చర్యలో కొన్ని యోగ ఆసనాలు చేయాలి. మరి ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారు ప్రతినిత్యం ఐదు యోగ ఆసనాలు కచ్చితంగా చేయాలి. దీని వలన బీపీ అనేది అదుపులో ఉండి ఎప్పుడు మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే మనం చేయవలసిన ఆ ఐదు యోగాసనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు నిత్యం కొన్ని నిమిషాల పాటు పవన్మక్తసనం చెయ్యాలి. అయితే ఈ ఆసనం చేయడం అంత కష్టం ఏమి కాదు. అయితే ఈ ఆసనం చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉండటమే కాక కడుపులో గ్యాస్ రిలీజ్ కావటం మరియు వెన్నునొప్పి నుండి ఉపశమనం, ఒత్తిడి తగ్గించటం, పొట్ట దగ్గర కొవ్వు తగ్గటం, ఎసిడిటీ లాంటి వాటి నుండి ఉపశమనం కలిగించడంతో పాటు ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది…
బలాసనం : బలాసనం వేయడం వలన కూడా మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాక ఒత్తిడి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.అలాగే నిద్రను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం బీపీ ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ యోగాసనం అనేది అలసటను కూడా దూరం చేయగలదు. అలాగే గుండె కండరాలను కూడా బలంగా చేస్తుంది. అంతేకాక బలాసనం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగకరంగా కూడా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడం వలన స్త్రీలు పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేసుకోగలుగుతారు…
సేతుబంధాసనం : మీరు ఈ ఆసనాన్ని చేస్తున్నప్పుడు ఛాతి కండరాలు అనేవి తెరుచుకుంటాయి. దీనితో పాటు ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ ను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడం వలన అధిక రక్తపోటు తో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి నుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక నిద్రలేమి, ఉబ్బసం, థైరాయిడ్ మొదలైన వాటి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని నిత్యం బాగా అభ్యాసం చేయడం వలన ఆరోగ్యానికి మంచిది…
హాస్త పదంగుష్ఠసనం : ఈ ఆసనం వేయడం వలన అధిక బీపీ ఉన్నటువంటి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆసనం వేయటం వల్ల చీలమండలు మరియు తొడలు, తుంటి, తోడ కండరాలు ఎంతో దృఢంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఏకగ్రతను కూడా పెంచగలదు.
Yoga : నిత్యం ఈ ఐదు యోగాసనాలు చేస్తే చాలు… ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!
భ్రమరీప్రాణాయామం : అధిక రక్తపోటుతో బాధపడేవారు నిత్యం ఈ ఆసనం కచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ఆందోళన,మైగ్రేన్, సాధారణ తలనొప్పి తగ్గటం మరియు మనస్సు ప్రశాంతత, దృష్టి పెరగడం, వినికిడి, సామర్థ్యం పెరగడం లాంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…
TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…
This website uses cookies.