
Good news for people Hyderabad of Bullet Train
Hyderabad Bullet Train : భారతదేశంలో అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. అనేక రంగాలకు సంబంధించి హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతుంది. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్.. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ వ్యాపార సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా హైదరాబాద్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ..
అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ వాసులకు త్వరలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం రెడీ అయింది. పూర్తి విషయంలోకి వెళ్తే దేశ ఆర్థిక రాజధాని ముంబై హైదరాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ ప్రాజెక్టును కేంద్రంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఈ క్రమంలో థానే జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ మహారాష్ట్ర సర్కార్ స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం కానుంది.
Good news for people Hyderabad of Bullet Train
దీంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన నేషనల్ హై స్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అధికారులు ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో భూసేకరణకు సంబంధించి ఏరియల్ సర్వే.. నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించారు. అయితే డిపిఆర్ ఆమోదం పొందుతే ఈ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు.. స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ముంబై నగరాల మధ్య దూరం 711 కిలోమీటర్లు. ఇని వందల కిలోమీటర్లు ప్రయాణించడానికి ప్రస్తుతం అతివేగంగా ప్రయాణిస్తున్న రైళ్లకు దాదాపు 12 నుంచి 14 గంటల సమయం పట్టనుంది. అయితే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం మూడు గంటల సమయంలోనే హైదరాబాదు నుండి.. ముంబైకు చేరుకునే పరిస్థితి ఉంటది.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.