Hyderabad : పెట్రోల్ కొరత ప్రభావం .. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ..!
ప్రధానాంశాలు:
Hyderabad : పెట్రోల్ కొరత ప్రభావం .. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ..!
Hyderabad : హైదరాబాద్ నగరంలో పెట్రోల్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఐటీ రంగంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇంధన కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఉపశమన చర్యలు చేపడుతున్నాయి. విప్రో, యాక్సెంచర్, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు ఉద్యోగుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పనులు నిర్వహించేందుకు వీలు కల్పించడం ద్వారా వారి సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేసే ప్రయత్నం జరుగుతోంది.
Impact of petrol shortage… Work from home for IT employees
కొంతమంది సంస్థలు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అందిస్తుండగా మరికొన్ని కంపెనీలు 50-50 హైబ్రిడ్ మోడల్ను అమలు చేస్తున్నాయి. అంటే వారంలో కొన్ని రోజులు కార్యాలయానికి రావడం మిగతా రోజులు ఇంటి నుంచే పని చేయడం. హైదరాబాద్లో సుమారు 9.5 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఎక్కువమంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతూ కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడం వల్ల రద్దీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో నగర రవాణా వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంస్థలు హైబ్రిడ్ పని విధానాలను కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది. పెట్రోల్ సమస్య ఐటీ రంగంలో పనితీరును మార్చే దిశగా ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది.