Parameshwar Reddy : ఉప్పల్ ప్రజలకు భరోసా.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎంపీఆర్
ప్రధానాంశాలు:
Parameshwar Reddy : ఉప్పల్ ప్రజలకు భరోసా.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎంపీఆర్
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో పంచుకుంటా” అంటూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మరింత చేరువ కావాలని సంకల్పించామని, అదే దిశగా ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని ఆయన చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.
Parameshwar Reddy : ఉప్పల్ ప్రజలకు భరోసా.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎంపీఆర్
Parameshwar Reddy : సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరికీ సహాయం
ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు తమ సమస్యలతో తనను కలుస్తున్నారని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఆరు గ్యారెంటీల అమలు, ఆరోగ్యశ్రీ సేవలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరు, విద్యుత్ మరియు తాగునీటి సమస్యలు వంటి అనేక అంశాలపై ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు.ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు విశ్రాంతి తీసుకోకుండా పనిచేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
రేవంతన్న మార్క్ ప్రజా పాలన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని ఎంపీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా పాలనలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.ఉప్పల్ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సంతోషమే తనకు ప్రేరణ అని, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాయకుడిగా సేవలందిస్తానని తెలిపారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండటం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని పేర్కొంటూ, ప్రజల ఆశీర్వాదాలతో మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.