Parameshwar Reddy : ప్రభుత్వ పాఠశాలలకు పెద్దపీట.. ఉప్పల్లో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేసిన పరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
Parameshwar Reddy : ప్రభుత్వ పాఠశాలలకు పెద్దపీట.. ఉప్పల్లో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేసిన పరమేశ్వర్ రెడ్డి
Parameshwar Reddy : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.సోమవారం నాచారం డివిజన్లోని వెస్లీ స్కూల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాచారం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వసునూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం అందించాలని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
Parameshwar Reddy : ప్రభుత్వ పాఠశాలలకు పెద్దపీట.. ఉప్పల్లో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేసిన పరమేశ్వర్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వంఈ సందర్భంగా మాట్లాడిన పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధి కోసం రూ.18 కోట్లు, కుషాయిగూడ జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధి కోసం రూ.19 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్యను అందుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు.
Parameshwar Reddy పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడమే లక్ష్యం: పరమేశ్వర్ రెడ్డి
పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. “చదువుతోనే పేదరికాన్ని అధిగమించవచ్చు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అందుకే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది” అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ఫూర్తితో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వసునూరి ప్రకాష్ రెడ్డి, బి. శ్రీకాంత్ గౌడ్, హెచ్.ఆర్. మోహన్, జి. కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, రమేష్ గౌడ్, అశ్వత్థామ రెడ్డి, మహేష్ యాదవ్, కృష్ణ యాదవ్, సుధాకర్ రెడ్డి, నూతనకంటి రాజు, బాలరాజు, కాప్రా సాయి, నరసింగ్ రావు, సునీల్ రెడ్డి, రఘు, కృపాకర్, అజీమ్, కోటేష్, కోత వెంకటేష్ గౌడ్, ఖయ్యూం, ఫహీమ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యూసుఫ్, షాహిక్, రేవంత్, జాఫర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.అలాగే మహిళా నాయకులు ఉమా, భావనా గౌడ్, భారతమ్మ, ఛాదు, ఎంఈఓ రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.







