Uppal Nalla Cheruvu : రూ.20 కోట్లతో ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి : హైడ్రా కమిషనర్ రంగనాథ్
Uppal Nalla Cheruvu : ఉప్పల్ నల్ల చెరువును రూ.20 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నల్ల చెరువును రూ.20 కోట్లతో పూర్తి స్థాయిలో సుందరీకరణ చేస్తున్నట్లుగా చెప్పారు. ఉప్పల్ నల్ల చెరువును గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి సందర్శించారు.
Uppal Nalla Cheruvu : రూ.20 కోట్లతో ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి : హైడ్రా కమిషనర్ రంగనాథ్
నల్ల చెరువులో అభివృద్ధి, సుందరీకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ సంబంధిత అధికారులకు సూచించారు.చెరువు పరిసర ప్రాంతాలలో కబ్జాలను సైతం త్వరలోనే తొలగించనున్నట్టుగా తెలిపారు.
కార్యక్రమంలో ఈగ అంజయ్య ముదిరాజ్, లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవిరెడ్డి,అలుగుల అనీల్ కుమార్ మంద మురళి కృష్ణ రెడ్డి,జనగాం రామకృష్ణ, సుంకు శేఖర్ రెడ్డి,గొరిగే మహేష్, అల్వల భాస్కర్,ప్రేమ్, మహంకాళి రాజు, రమణ ,ప్రతాప్ రెడ్డి, రామ్ రెడ్డి, బసిరెడ్డి,నల్లవెల్లి మహేందర్, తుమ్మల రాజేందర్ రెడ్డి,ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, కాటపల్లి విజయకుమార్, సిఎస్ నరేష్,రంగుల శేఖర్ ముదిరాజ్, ప్రశాంత్ రెడ్డి, సత్యం,పిలకల రామ్ రెడ్డి,ఎండీ ఆఫ్జాల్, రెడ్డి,మోహన్, మోహన్ నాయక్, చింతకింది శ్రీనివాస్, శివ గౌడ్, రవి, హరీష్ రెడ్డి, బచ్చారాం, ,తదితరులు పాల్గొన్నారు.
