Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్ CIL, గేట్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీస్ MT ప్రకటనను విడుదల చేసింది. ఈ మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ 29 అక్టోబర్ 2024 నుండి 28 నవంబర్ 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Coal India Limited ఖాళీల వివరాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్ : 640 పోస్టులు (జనరల్- 190, ఈడబ్ల్యూఎస్‌- 43, ఎస్సీ- 67, ఎస్టీ- 34, ఓబీసీ- 124)
విభాగాల వారీగా ఖాళీలు : మైనింగ్- 263; సివిల్- 91; ఎలక్ట్రికల్- 102; మెకానికల్- 104; సిస్టమ్- 41; ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్- 39.
అర్హత : కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌), బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 అర్హత సాధించి ఉండాలి.
వయో పరిమితి : 30-09-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు : నెలకు రూ.50,000- రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ : గేట్-2024 స్కోర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము : జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28-11-2024.

Coal India Limited కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

ముఖ్యాంశాలు :
640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి కోల్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీటెక్‌, గేట్‌ 2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
అభ్యర్థులు నవంబర్‌ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Also read

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి