పబ్జి ప్రియుడు కోసం ఇండియాకి వచ్చిన పాక్ మహిళకు ఊహించని షాక్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 19 July 2023, 11:00 am

ప్రేమ ఎంత ప్రభావం చూపుతుంది అన్నది చరిత్రలో చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రేమలో పడితే సదరు యువతీకైనా ఆ వ్యక్తికైనా అసలు.. వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందన్నది తెలీదంటారు. అందుకే ప్రేమ గుడ్డిది దానికి మతంలోని కులం గాని.. ఏది ఉండదని చెబుతారు. అంతేకాదు దానికి వయసుతో కూడా సంబంధం లేదని చెబుతారు. తాజాగా ఈ రీతిగానే వయసుతో సంబంధం లేకుండా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలో భారత్ కి అతి పెద్ద శత్రువు పాకిస్తాన్ అని అందరికీ తెలుసు. అటువంటి పాకిస్తాన్ దేశానికి చెందిన పెళ్లయినావో అమ్మాయి భారత్ కి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది.

అంతేకాదు సదరు మహిళలకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 2019లో పరిచయం ఏర్పడగా తర్వాత అది కాస్త ప్రేమగా.. పెళ్లిదాకా రావడం జరిగింది. ఇండియాలో ఉత్తర ప్రదేశ్ కి చెందిన సచిన్ కి పబ్జి గేమ్ ఆడే అలవాటు ఉంది. పాకిస్తాన్ కి చెందిన సీమ హైదర్ అనే పెళ్లయిన మహిళకి కూడా పబ్జి అలవాటు ఉంది. అయితే వీరిద్దరు.. పబ్జి గేమ్ ఆడుతూనే ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఇండియాకి చెందిన సచిన్ ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పాకిస్తాన్ కి చెందిన సీమ హైదర్ తను నలుగురు పిల్లలను తీసుకొని.. ముందు నేపాల్ వెళ్లి అక్కడ నుంచి భారతలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఇద్దరూ ఇండియాలో పెళ్లి చేసుకున్నారు. అయితే సీమ పాకిస్తాన్ పౌరురాలని పోలీసులు గుర్తించటంతో ఆమెను భారత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్తో కలిసి ఏదైనా కుట్రలు చేస్తుందా అనే అనుమానంతో..

A woman came to india for a pubg boyfriend

A woman came to india for a pubg boyfriend

భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు. అయితే విచారణలో ప్రేమ వ్యవహారమే.. తేలింది. మరోపక్క సినిమా పాకిస్తాన్ కి వెళ్లే ప్రసక్తి లేదని ఇండియాలో హిందువుగానే కొనసాగుతానని స్పష్టం చేసింది. ఇక పాకిస్తాన్ లో ఉన్న సీమ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే హిందువుగా మారిందో ఆమెకు తమకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కానీ సినిమాకి పుట్టిన నలుగురు పిల్లలను పాకిస్తాన్ కి పంపించాలని సూచించారు. కానీ భారత్ పోలీసులు మాత్రం సీమపై అక్రమ చోరబాటు కేసు నమోదు చేశారు.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp