Mark Zuckerberg : సారీ చెప్పాంల్సిందే… మార్క్ మీద యుద్ధం మొదలైంది..?
Mark Zuckerberg ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటాకు మరోసారి సమన్లు జారీ చేసింది. జోయెల్ కప్లాన్, ఇన్స్టాగ్రామ్ టెక్నికల్ అధికారుల విచారణతో పాటు జుకర్బర్గ్ నుంచి క్షమాపణ కోరే అవకాశంపై పూర్తి వివరాలు.
Mark Zuckerberg : ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబించింది. ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్కు వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేవలం జోయెల్ కప్లాన్ మాత్రమే కాకుండా, ఇన్స్టాగ్రామ్కు చెందిన కీలక సాంకేతిక అధికారులను కూడా విచారణకు హాజరుకావాలని కేంద్రం ఆదేశించింది. మెటా ఆధ్వర్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అల్గారిథమ్ ఎలా పనిచేస్తోంది? ఏ ప్రమాణాల ఆధారంగా పోస్టుల రీచ్, వ్యూస్ నిర్ణయించబడుతున్నాయి? అనే అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ కోరనుంది.
Mark Zuckerberg : సారీ చెప్పాంల్సిందే… మార్క్ మీద యుద్ధం మొదలైంది..?
Mark Zuckerberg మెటా అల్గారిథమ్పై కేంద్రం ఫోకస్.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై కూడా విచారణ
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే పోస్టులకు అసాధారణ స్థాయిలో వ్యూస్, రీచ్ లభిస్తున్నాయంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెటా అల్గారిథమ్ పనితీరులో ఏవైనా ఉద్దేశపూర్వక మార్పులు జరిగాయా? లేదా ప్రత్యేక విధానాలు అమలులో ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ప్రశ్నలు సంధించనున్నట్లు సమాచారం.గత వారం కూడా ఇదే అంశంపై కేంద్ర ఐటీ శాఖ జోయెల్ కప్లాన్కు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దేశ ప్రధానికి సంబంధించిన వీడియోను ఎందుకు తొలగించారనే విషయంపై అప్పుడే వివరణ కోరింది. అంత ముఖ్యమైన వీడియో తొలగిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నిజంగా అది సాంకేతిక లోపమా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రం అప్పుడే ఆదేశించింది.
Mark Zuckerberg జుకర్బర్గ్ నుంచి క్షమాపణ లేఖ కోరే అవకాశం.. సాంకేతిక నివేదిక కూడా తప్పనిసరి
ఈ ఘటనపై మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్బర్గ్ నుంచి అధికారిక రాతపూర్వక క్షమాపణ లేఖ తీసుకునే అవకాశమూ ఉందని సమాచారం. జరిగిన పొరపాటును అంగీకరిస్తూ సంస్థ తరఫున అధికారిక వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, ప్రధాని మోదీ వీడియో తొలగింపునకు దారితీసిన అసలు సాంకేతిక కారణం ఏమిటో వివరించే ప్రత్యేక సాంకేతిక నివేదికను కూడా సమర్పించాలని మెటా ప్రతినిధులకు సూచించనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో వీడియో ఎందుకు తొలగించబడింది? అది ఆటోమేటెడ్ సిస్టమ్ వల్ల జరిగిందా? లేక మానవ జోక్యం ఉందా? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే సోషల్ మీడియా సంస్థల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా దేశ ప్రధానికి సంబంధించిన కంటెంట్ను సాంకేతిక లోపాల పేరుతో తొలగించడాన్ని ప్రభుత్వం ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు.బుధవారం జరగనున్న కీలక సమావేశంలో మెటా ప్రతినిధులు సమర్పించే రాతపూర్వక వివరణ, సాంకేతిక నివేదిక ఈ వివాదానికి కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ, సాంకేతిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.







