Lok Sabha and AP Elections : బిగ్ బ్రేకింగ్.. ఒకేసారి లోక్ సభకు, ఏపీకి ఎన్నికలు.. డేట్ ఫిక్స్ చేసిన ఈసీ..!
Lok Sabha and AP Elections : ఈసారి దేశం అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటుంది. ప్రతి ఎన్నిక కీలకమైనది. అయితే ఈసారి ఇంకా కీలకం అని అంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి గెలవాలని ఉరకలేస్తున్నారు. తమకు 370 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇక మరోవైపు ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమికట్టి మోడీని దించేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక మరోవైపు ఏపీ వంటి కీలక రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి తమదే అధికారం అని అంటుంది. ఇక వైయస్ జగన్ వైసీపీ పార్టీని దెబ్బ కొట్టాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తుంది. అందుకనే ఈసారి సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు కేంద్రంలో ఈసారి ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి వివిధ రాష్ట్రాల్లో సమీకరణాలు మారతాయని చెప్పవచ్చు.
2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 న విడుదలైంది. ఈసారి కూడా ఇదే నెలలో రావడం ఖాయం అని తెలుస్తుంది. అయితే కచ్చితంగా చెప్పుకున్నప్పటికీ మార్చి 9న షెడ్యూల్ వెలువడుతుందని జాతీయ మీడియా చెబుతోంది. అంటే గతంలో ఒక కంటే ఒక రోజు ముందు అని. కేంద్ర ఎన్నికల సంఘం తమ ప్రయత్నాలను దాదాపుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. లోక్ సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం పర్యటనలు చేస్తోంది. ఆయా చోట్ల సన్నాహాలను పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే గత శనివారం ఒడిశా వెళ్లిన ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లోని అధికారులతో సమావేశం అయినాకే ఈ మేరకు చెప్పే వీలుంటుంది.
అందుకని అధికారులు షెడ్యూల్ దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 2019లో మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. నాడు ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఏడు దశలకు తొలి దశలోనే ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. చివరి దశగా మే 19 వరకు దేశంలో ఏడు దశల్లో పోలింగ్ జరగక మే 23న ఫలితాలు వెలువడ్డాయి. మరి ఇప్పుడు ఒకరోజు ముందుగా షెడ్యూల్ వస్తుంది. పోలింగ్, ఫలితాల వెల్లడి ఎన్ని దశల్లో ఎన్నికలు జరగవుతాయి అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈసారి లోక్ సభ తో పాటు ఏపీ ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మే లోగా ఎన్నికలు జరగాలి. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. మార్చి 12 , 13 తేదీల్లో కాశ్మీర్లో ఎన్నికల సంఘం పర్యటించనుంది. లోక్ సభ తో పాటు అక్కడ అసెంబ్లీకి ఎన్నికలకు అంచనాకు రానుంది. ఒకవేళ ఇలా అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెల్లడి మార్చి రెండో వారంలోకి వెళుతుంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.