Categories: ExclusiveNationalNews

Central Govt : ఇక పై రోడ్డు ప్రమాదం బాధితులకు ఉచిత చికిత్స… కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్…!

Advertisement
Advertisement

Central Govt : ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే రోడ్డు ప్రమాదాలు అనేవి అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి నడపటం వలన జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. మరికొందరు అంగవైకల్యం పొందుతున్నారు. అయితే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు సరైన చికిత్స అందకపోవడం వలన చాలామంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Advertisement

తాజాగా కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతను అలాగే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఈ కొత్త పథకం ద్వారా బాధితులకు వెంటనే వైద్య సేవలు అందనున్నట్లు తెలుస్తుంది. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికోసం ఎలాంటి ఫీజు లేకుండా ట్రీట్మెంట్ చేసే విధంగా కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయమైన వారు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా చికిత్స పొందవచ్చు.

Advertisement

అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రవేశ పెట్టబోతోంది. ఇక ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదట దీనిని చండీగఢ్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ పథకాన్ని ముందుగా ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఎలా పనిచేస్తుందో పర్యవేక్షించి అనంతరం దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ పథకంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని ఒక మంచి ప్రణాళికతో ప్రాజెక్టును కొనసాగిస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు విజయవంతమైనట్లయితే దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు కారణంగా గాయపడుతున్న చాలామందికి ఉచిత వైద్యం అందుతుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా మరణాలు గణనీయంగా తగవచ్చు.

ఇది ఇలా ఉంటే తాజాగా వెలువడిన ఓ నివేదిక ప్రకారం 2022లో దేశ వ్యాప్తంగా 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.68 లక్షల మంది మరణించగా 4.43 లక్షల మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ పథకం అమలులోకి తీసుకువచ్చినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందడంతో వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇక ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని పౌరులు ఎవరైనా సరే ప్రమాదానికి గురైన వెంటనే సమీపంలోని ఏదైనా ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందే విధంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఆసుపత్రులు పనిచేస్తాయి. ఇక ఈ వైద్యానికి బాధితుడి నుండి ఒక రూపాయి కూడా వసూలు చేయరు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.