
Central Govt : ఇక పై రోడ్డు ప్రమాదం బాధితులకు ఉచిత చికిత్స... కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్...!
Central Govt : ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే రోడ్డు ప్రమాదాలు అనేవి అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి నడపటం వలన జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. మరికొందరు అంగవైకల్యం పొందుతున్నారు. అయితే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు సరైన చికిత్స అందకపోవడం వలన చాలామంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతను అలాగే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఈ కొత్త పథకం ద్వారా బాధితులకు వెంటనే వైద్య సేవలు అందనున్నట్లు తెలుస్తుంది. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికోసం ఎలాంటి ఫీజు లేకుండా ట్రీట్మెంట్ చేసే విధంగా కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయమైన వారు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా చికిత్స పొందవచ్చు.
అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రవేశ పెట్టబోతోంది. ఇక ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదట దీనిని చండీగఢ్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ పథకాన్ని ముందుగా ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఎలా పనిచేస్తుందో పర్యవేక్షించి అనంతరం దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ పథకంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని ఒక మంచి ప్రణాళికతో ప్రాజెక్టును కొనసాగిస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు విజయవంతమైనట్లయితే దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు కారణంగా గాయపడుతున్న చాలామందికి ఉచిత వైద్యం అందుతుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా మరణాలు గణనీయంగా తగవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా వెలువడిన ఓ నివేదిక ప్రకారం 2022లో దేశ వ్యాప్తంగా 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.68 లక్షల మంది మరణించగా 4.43 లక్షల మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ పథకం అమలులోకి తీసుకువచ్చినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందడంతో వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇక ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని పౌరులు ఎవరైనా సరే ప్రమాదానికి గురైన వెంటనే సమీపంలోని ఏదైనా ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందే విధంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఆసుపత్రులు పనిచేస్తాయి. ఇక ఈ వైద్యానికి బాధితుడి నుండి ఒక రూపాయి కూడా వసూలు చేయరు.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.