New Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీకు తెలుసా… ఒక్కొక్కరికి 2 లక్షలు…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 4 May 2024, 8:00 am
  •  New Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీకు తెలుసా... ఒక్కొక్కరికి 2 లక్షలు...!

New Scheme : దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నప్పటికీ ప్రజలకు వాటిపై పూర్తి అవగాహన ఉండడం లేదు. వందల సంఖ్యలో పథకాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా ప్రచారం చేయకపోవడంతో ప్రజలు ఆ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇక అలాంటి పథకం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.

New Scheme : ప్రధానమంత్రి ఈ శ్రమ్ యోజన…

అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు అందజేస్తుంది. దీనిలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు , వలస కార్మికులు ,ప్లాట్ ఫారమ్ కార్మికులు , వీధి వ్యాపారులు ,గృహ కార్మికులు వ్యవసాయ కార్మికులు , ట్రక్ డ్రైవర్లు , మత్స్యకారులు , అందరూ కూడా ఈ పథకానికి అర్హులవుతారు. ఇక ఈ పథకానికి నమోదు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం 12 అంకెల ఈ కార్డును ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కార్డు అనేది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అలాగే కార్మికుల గణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ శ్రమ్ కార్డును ఆధార్ తో లింక్ చేస్తుంది. తద్వారా అర్హులైన వారందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు..

New Scheme : అర్హత…

అయితే ఈ శ్రమ్ అర్హత పొందాలంటే కార్మికుల వయసు 15 నుండి 59 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా కార్మికులు ఆదాయపు పన్ను చెల్లింపు దారులుగా ఉండకూడదు. అంటే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేదల కోసం తీసుకువచ్చింది కాబట్టి పేదలకు పన్నులు చెల్లించేంత ఆదాయం ఉండదు. అదేవిధంగా కార్మికులు EPFO , ESIC సభ్యులుగా ఉండకూడదు.

New Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీకు తెలుసా... ఒక్కొక్కరికి 2 లక్షలు...!

New Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీకు తెలుసా… ఒక్కొక్కరికి 2 లక్షలు…!

New Scheme : ప్రయోజనాలు ఏంటంటే…

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ కార్డ్ పథకానికి నమోదు చేసుకున్నవారు కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక పథకాల కోసం ప్రత్యేకంగా మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రమాద బీమా కూడా పొందుతారు. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 365 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించిన లేదా వికలాంగుడు అయిన ఈ పథకం ద్వారా చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు 2 లక్షలు, అంగవైకల్యం ఏర్పడిన కార్మికుడి కుటుంబానికి లక్ష పరిహారం అందిస్తారు.

రిజిస్ట్రేషన్ కు కావలసిన పత్రాలు…

ఈ శ్రమ్ కార్డ్ పోర్టల్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే పేరు, వృత్తి , శాశ్వత చిరునామా, విద్యార్హత వివరాలు, నైపుణ్యాలు ,అనుభవ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు ,ఆధార్ నెంబర్ , ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ , ఖాతా హోల్డింగ్ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సీ కోడ్ కలిగి ఉండాలి. ఈ వివరాల ద్వారా మీరు ఈ పార్టెల్ లో నమోదు చేసుకోవచ్చు.

ఎలా నమోదు చేసుకోవాలంటే…

దీనికి నమోదు చేసుకోవాలి అనుకునేవారు మీ సమీప ప్రాంతంలో గల మీసేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి