Farmer Rights Law : మీ పొలానికి రోడ్ కావాలంటే ఈ చట్టం ద్వారా ఈజీ గా వచ్చేస్తుంది…!
ప్రధానాంశాలు:
Farmer Rights Law : మీ పొలానికి రోడ్ కావాలంటే ఈ చట్టం ద్వారా ఈజీ గా వచ్చేస్తుంది...!
Farmer Rights Law : ఏంటి మీ పొలానికి రోడ్ లేదా..? అయితే ఇలా చేస్తే మీకు రోడ్ వస్తుంది.
Farmer Rights Law: మీ పొలానికి దారి లేకపోతే ఈ చట్టం ద్వారా రోడ్ హక్కు పొందవచ్చు
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి పొలం చుట్టూ ఇతరుల భూములు ఉండటం వల్ల, ప్రధాన రహదారి నుంచి తమ పొలానికి వెళ్లడానికి దారి లేక రైతులు సతమతమవుతుంటారు. విత్తనాలు, ఎరువులు మోసుకెళ్లాలన్నా లేదా పండించిన పంటను మార్కెట్కు తరలించాలన్నా సరైన మార్గం లేకపోతే సాగు భారమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగువారు దారి ఇవ్వనని మొండికేస్తే, రైతును ఆదుకోవడానికి ‘భారతీయ ఈజ్మెంట్స్ చట్టం 1882’ ( Indian Easements Act, 1882 ) అందుబాటులో ఉంది. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి తన ఆస్తిని (పొలాన్ని) అనుభవించడానికి వేరొకరి ఆస్తి గుండా వెళ్లే హక్కును చట్టబద్ధంగా పొందవచ్చు.

Farmer Rights Law : మీ పొలానికి రోడ్ కావాలంటే ఈ చట్టం ద్వారా ఈజీ గా వచ్చేస్తుంది…!
అవసర సౌలభ్యత మరియు చట్టపరమైన హక్కులు
ఈ చట్టంలో అత్యంత ముఖ్యమైనది ‘అవసర సౌలభ్యత హక్కు’ (Easement of Necessity). ఒక రైతుకు తన పొలానికి చేరుకోవడానికి వేరే ఏ ఇతర ప్రత్యామ్నాయ మార్గం లేనప్పుడు, అతను కచ్చితంగా పొరుగువారి భూమి గుండా దారిని కోరవచ్చు. ఇది ఎవరి దయాదాక్షిణ్యం మీదో ఆధారపడేది కాదు, ఇది రైతుల ప్రాథమిక సాగు హక్కు. ఒకవేళ పొరుగువారు కావాలని అడ్డుతగిలినా, ముళ్లకంచె వేసినా, సదరు రైతు సివిల్ కోర్టును ఆశ్రయించి దారిని పునరుద్ధరించుకోవచ్చు. కోర్టు ద్వారా ‘ఇంజంక్షన్’ ఆర్డర్ పొందితే, పొరుగువారు ఆ దారిని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమవుతుంది.
Farmer Rights Law: మీ పొలానికి రోడ్ కావాలంటే ఈ చట్టం ద్వారా ఈజీ గా వచ్చేస్తుంది.
శాశ్వత పరిష్కారం
మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఏదైనా ఒక మార్గాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా 20 సంవత్సరాల పాటు నిరంతరంగా, శాంతియుతంగా ఉపయోగిస్తున్నట్లయితే, అది ‘ప్రిస్క్రిప్షన్ సౌలభ్యత’ (Easement by Prescription) కింద శాశ్వత హక్కుగా మారుతుంది. అంటే, ఇన్నాళ్లూ వాడుకున్న దారిని ఎవరూ ఒక్కసారిగా మూసివేయలేరు. తరతరాలుగా వాడుకలో ఉన్న ఆచార మార్గాలకు (Customary Easements) కూడా చట్టం అదే రక్షణ కల్పిస్తుంది. భూమి యజమానుల మధ్య వివాదం తలెత్తినప్పుడు, రెవెన్యూ మ్యాపులు మరియు సాక్ష్యాలతో సివిల్ కోర్టులో దావా వేసి తమ హక్కును నిలబెట్టుకోవచ్చు. రైతులు ఈ చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటేనే తమ భూములను స్వేచ్ఛగా సాగు చేసుకుని ఆర్థికంగా బలపడగలరు.