Central Government : గుడ్న్యూస్ .. రైతుల కోసం కేంద్రం కొత్త స్కీమ్ .. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు ఇలా అప్లై చేసుకుంటే చాలు..!
ప్రధానాంశాలు:
Central Government : గుడ్న్యూస్ .. రైతుల కోసం కేంద్రం కొత్త స్కీమ్ .. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు ఇలా అప్లై చేసుకుంటే చాలు..!
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. నేరుగా నగదు బదిలీలు చేయడం, ఎరువులు మరియు వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీలు అందించడం, తక్కువ వడ్డీ రేటుతో రుణాలు కల్పించడం వంటి చర్యల ద్వారా రైతులకు సహాయం అందుతోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. హోలీ పండుగ సందర్భంగా 22వ విడతకు చెందిన రూ.2,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఇక నగదు సాయంతో పాటు పునరుత్పాదక శక్తి రంగంలో రైతులను ప్రోత్సహించే మరో కీలక పథకం పీఎం కుసుమ్ యోజన. ఈ పథకం ద్వారా రైతులకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.
Central Government : గుడ్న్యూస్ .. రైతుల కోసం కేంద్రం కొత్త స్కీమ్ .. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు ఇలా అప్లై చేసుకుంటే చాలు..!
Central Government : 60 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు
పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు సోలార్ పంపుసెట్లపై 60 శాతం వరకు కేంద్ర సబ్సిడీ లభిస్తుంది. అదనంగా 30 శాతం రుణాన్ని బ్యాంకులు అందిస్తాయి. మిగిలిన 10 శాతం మొత్తాన్ని రైతులు స్వయంగా భరించాలి. ఈ విధంగా తక్కువ పెట్టుబడితోనే రైతులు సౌర విద్యుత్ ఆధారిత పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పంపుసెట్ల ద్వారా పంట సాగుకు నీటి సరఫరా సులభమవుతుంది. అంతేకాదు అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి అయితే దాన్ని ప్రభుత్వ డిస్కమ్లకు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చు. 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 34,800 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని పెంచడమే కేంద్ర లక్ష్యం.
Central Government : అర్హతలు మరియు దరఖాస్తు విధానం
ఈ పథకానికి రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు చేయాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫారమ్పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలు నమోదు చేసి డిక్లరేషన్ బాక్స్ను గుర్తించి సబ్మిట్ చేయాలి. అనంతరం లాగిన్ అయి పూర్తి అప్లికేషన్ నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజు ఫోటో, డిక్లరేషన్ ఫామ్, బ్యాంక్ పాస్బుక్, భూమి పత్రాలు.
Central Government : లక్షల్లో ఆదాయం పొందే అవకాశం
ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే రోజుకు సుమారు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ను రాష్ట్ర డిస్కమ్లు 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తాయి. ముందుగానే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ప్రస్తుతం ఒక యూనిట్కు సుమారు రూ.3.13 చొప్పున ధర లభిస్తే రోజుకు దాదాపు రూ.14,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా చూస్తే లక్షల్లో ఆదాయం సాధ్యమవుతుంది. పంట సాగుకు ఉపయోగపడటమే కాకుండా, అదనపు ఆదాయ వనరుగా కూడా ఈ పథకం రైతులకు బలమైన ఆధారంగా నిలుస్తోంది.