#image_title
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి సందర్భంగా త్వరలో బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. పండుగ సీజన్ కావడంతో డీఏను త్వరలోనే పెంచుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను పెంచుతుంది. ఈసంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. మళ్లీ జులైలో పెరగాల్సి ఉంది కానీ.. పెరగలేదు. దసరా సందర్భంగా త్వరలోనే పెరిగే అవకాశం ఉంది. అది కూడా త్వరలోనే నరేంద్ర మోదీ కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. డీఏ, డీఆర్ పెంపుపై నిర్ణయం తీసుకోగానే వెంటనే ప్రకటించే అవకాశం ఉంది.
డీఏను మరో 4 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేటు, సీపీఐ ఇండెక్స్ రేటును దృష్టిలో పెట్టుకొని డీఏను 3 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24న దసరా పండుగ ఉంది. ఈనేపథ్యంలో డీఏ పెంపుపై ఖచ్చితంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా.. జులై 1, 2023 నుంచే డీఏ పెంపు అమలు కానుంది. డీఏ బకాయిలను కూడా కేంద్రం చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 4 శాతం డీఏ పెంపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డీఏ, డీఆర్ 42 శాతం అందిస్తున్నారు. మరో 4 శాతం పెరిగితే అది 46 శాతం అవుతుంది.
#image_title
డీఏను ప్రస్తుతం ఉన్న సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ప్రకారం లెక్కిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం డీఏను ఇస్తుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను కేంద్రం పెంచుతుంది. మార్చి 2023 లో డీఏను పెంచారు. అప్పుడు 38 శాతంగా ఉన్న డీఏను 42 శాతానికి పెంచారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.