Udyogini Scheme : ఉద్యోగిని పథకం ద్వారా మహిళలకు కేంద్రం శుభవార్త... వడ్డీ లేకుండా రుణాలు...!
Udyogini Scheme : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అనేక రకాల పథకాలు ద్వారా ఆర్థిక సాయం అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యాపారులకు సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకం ద్వారా మహిళలకు కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని, తద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి సాధిస్తారనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఈ పథకం ద్వారా కేంద్రం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఉచితంగా అయితే ఇవ్వడం లేదు. వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. అంటే ఈ పథకం ద్వారా పొందిన డబ్బును వ్యాపారానికి వాడుకుని తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం. ఇక ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళా రైతులు సైతం బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. అయితే ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను పొందడంతో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పొందవచ్చు. ఇక ఈ పథకం నుండి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్రం అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉద్యోగిని పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను పొందాలంటే కచ్చితంగా వారు 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆర్థిక ఆదాయాన్ని కలిగి ఉండాలి. ఇక భర్త లేని మహిళలకు దివ్యంగులైన వారికి ఆదాయంలో పరిమితులు ఉండదు. ఈ పథకంలో రుణాలు పొందేందుకు SC,ST మహిళలకు ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మహిళలు కచ్చితంగా 18 నుండి 55 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు పొందాలంటే మహిళలు ఇదివరకు బ్యాంకులో తీసుకున్న రుణాలు సమర్థవంతంగా పూర్తి చేసి ఉండాలి.
Udyogini Scheme : ఉద్యోగిని పథకం ద్వారా మహిళలకు కేంద్రం శుభవార్త… వడ్డీ లేకుండా రుణాలు…!
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు పొందాలంటే కచ్చితంగా ఈ పత్రాలు సమస్యించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
జన్మ ధ్రువీకరణ పత్రం
చిరునామా ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం
రేషన్ కార్డు
కుల ధ్రువీకరణ పత్రం
బ్యాంక్ పాస్ బుక్
బీపీఎల్ కార్డు..
వీటితోపాటు బ్యాంకు వారు ఇతర పత్రాలను కోరితే వాటిని కూడా సమర్పించాలి.
దరఖాస్తు…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగిని పథకం కి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీ సమీప ప్రాంతంలో గల బ్యాంకుకు వెళ్లి ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులోనే ఈ పథకానికి సంబంధించి ఒక ఫామ్ ఇస్తారు. దానిని పూర్తి చేసి బ్యాంక్ వారికి తిరిగి ఇవ్వాలి. మీ వివరాలను పరిశీలించిన అనంతరం బ్యాంకు వారు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాని ఆన్లైన్ ద్వారా చేసే కంటే డైరెక్ట్ గా బ్యాంకుకు వెళ్లి చేయడం ద్వారా త్వరగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.