Crime News : నా భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. మీరే న్యాయం చేయాలన్న భర్త

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 5 January 2023, 8:30 am

Crime News : ఈరోజుల్లో ఒక్కరితో సంబంధం పెట్టుకుంటేనే ఎన్నో తంటాలు పడాలి కానీ.. ఓ మహిళ మాత్రం ఏకంగా 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ను ఎట్ ఎ టైమ్ మెయిన్ టెన్ చేస్తోంది. పెళ్లయిన మహిళ అయి ఉండి కూడా భర్తను మోసం చేస్తూ 50 మందితో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్న ఆ మహిళ గుట్టు తాజగా బయటపడింది. దీంతో భర్త లబోదిబో అనడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది.

man complaints about his wife having multiple affairs

man complaints about his wife having multiple affairs

తమిళనాడులోని కన్యాకుమారి పరిధిలో తిరువత్తర్ అనే ప్రాంతం ఉంది. అక్కడే ముత్తురామ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ముత్తురామ్ కు ఫేస్ బుక్ ద్వారా నజీనా అనే ఓ యువతి పరిచయం అయింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆ యువతితో చాటింగ్ చేసిన ముత్తురామ్ తర్వాత ఆమెను కలిశాడు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్ని రోజుల పాటు సంతోషంగానే ఉన్నారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు ఎదురు కట్నం ఇవ్వాలంటూ అతడిని బెదిరించింది. దీంతో ఒక కారు, 40 సవర్ల నగలు, 3 లక్షల డబ్బును కట్నంగా భార్యకు ఇచ్చాడు.

Crime News : భార్య ఫోన్ ను చూసి ముత్తురామ్ షాక్

అయితే.. ఇటీవల తన ఫోన్ నీటిలో పడిపోయింది. దీంతో ముత్తురామ్ తన భార్య ఫోన్ ను వాడసాగాడు. ఒకసారి భార్య ఫోన్ ను చెక్ చేయగా అసలు విషయం అప్పుడు బయటపడింది. తను దాదాపు 50 మందితో సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న మగాళ్లతో తను రొమాంటిక్ చాట్ చేయడం చూశాడు. పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పి నజీరా తన బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటుందట. ఇదంతా తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త. ఎలాగైనా మీరే న్యాయం చేయాలంటూ కోరాడు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి