
సంచలన నిర్ణయం... ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదే ఓపీఎస్. దాన్నే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ అమలు అవుతోంది. దాన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. అంటే.. ఉద్యోగులు రిటైర్ అయ్యాక వాళ్లకు వచ్చే బెనిఫిట్స్ కు సంబంధించిన స్కీమ్ అన్నమాట. అయితే.. చాలా రోజుల నుంచి ఎన్పీఎస్ బదులు ఓపీఎస్ ను తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సీపీఎస్ బదులు జీపీఎస్ ను తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం జీపీఎస్ పై ఇటీవలే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ.. ఏపీలో కూడా ఓపీఎస్ విధానాన్నే తీసుకురావాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
2003 కంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ లో చేరేలా ఆప్షన్ ఇస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ) ప్రకటించింది. అంటే.. 2003 డిసెంబర్ 22 తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఎన్పీఎస్ వర్తిస్తుంది. ఏఐఎస్ రూల్స్, 1958 ప్రకారం.. 2003, డిసెంబర్ 22 కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఈ అవకాశం రానుంది.
7th Pay Commission
నిజానికి ఎన్పీఎస్ కంటే కూడా ఓపీఎస్ లో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం.. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ లో 50 శాతం లేదు. 50 శాతం కంటే తక్కువ పెన్షన్ ఉంది. అందుకే ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు. తాజాగా 2003 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తించనుండటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. అది కొంత మందికే కావడంతో అందరు ఉద్యోగులకు ఎన్పీఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ స్కీమ్ ను వర్తింపజేయాలని కోరుతున్నారు.
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
This website uses cookies.