7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదే ఓపీఎస్. దాన్నే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ అమలు అవుతోంది. దాన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. అంటే.. ఉద్యోగులు రిటైర్ అయ్యాక వాళ్లకు వచ్చే బెనిఫిట్స్ కు సంబంధించిన స్కీమ్ అన్నమాట. అయితే.. చాలా రోజుల నుంచి ఎన్పీఎస్ బదులు ఓపీఎస్ ను తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సీపీఎస్ బదులు జీపీఎస్ ను తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం జీపీఎస్ పై ఇటీవలే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ.. ఏపీలో కూడా ఓపీఎస్ విధానాన్నే తీసుకురావాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
2003 కంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ లో చేరేలా ఆప్షన్ ఇస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ) ప్రకటించింది. అంటే.. 2003 డిసెంబర్ 22 తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఎన్పీఎస్ వర్తిస్తుంది. ఏఐఎస్ రూల్స్, 1958 ప్రకారం.. 2003, డిసెంబర్ 22 కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఈ అవకాశం రానుంది.
నిజానికి ఎన్పీఎస్ కంటే కూడా ఓపీఎస్ లో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం.. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ లో 50 శాతం లేదు. 50 శాతం కంటే తక్కువ పెన్షన్ ఉంది. అందుకే ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు. తాజాగా 2003 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తించనుండటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. అది కొంత మందికే కావడంతో అందరు ఉద్యోగులకు ఎన్పీఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ స్కీమ్ ను వర్తింపజేయాలని కోరుతున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.